25న హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన
హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో ఆయన సోమవారం ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులతో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు.
సమీక్షిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్టుడే: హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో ఆయన సోమవారం ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులతో కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వహక అధ్యక్షులు జస్టిస్ ఏవీ శేషసాయి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్, జస్టిస్ గంగారావు, జస్టిస్ శ్యాంసుందర్లు జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. రాయదుర్గంలో నిర్వహించే మహిళా న్యాయ అవగాహన కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ఈసమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రమేష్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి దీనబాబు, సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్కుమార్, ఎస్పీ రాహుల్దేవ్సింగ్, అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా