ఉత్తర్వుల పేరుతో వేధింపులు తగవు
సజావుగా విధులను నిర్వహిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న రైల్వే డ్రైవర్లు, సహాయ డ్రైవర్లను అధికారులు రకరకాల ఉత్తర్వుల పేరుతో వేధించడం...
కుటుంబాలతో సహా రైల్వే డ్రైవర్లు, సహాయకుల ధర్నా
నిరసన తెలుపుతూ..
గుంతకల్లు, న్యూస్టుడే: సజావుగా విధులను నిర్వహిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న రైల్వే డ్రైవర్లు, సహాయ డ్రైవర్లను అధికారులు రకరకాల ఉత్తర్వుల పేరుతో వేధించడం అన్యాయమని రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి విజయకుమార్, అదనపు కార్యదర్శులు మహమ్మద్ గౌస్, మస్తాన్వలి అన్నారు. అధికారులు తమ డిమాండ్లను తీర్చాలని కోరుతూ లోకో రన్నింగ్ సిబ్బంది మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వారి కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే జంక్షన్లోని క్రూ కంట్రోల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. పనిచేసే సిబ్బంది కంటే అధికారుల పోస్టులు అధికంగా ఉండడంతో రకరకాల ఉత్తర్వులు, ఆదేశాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సిబ్బంది ఆయా రైలు మార్గాల్లో విధులు నిర్వహించిన తరువాత వారు ఎక్కడెక్కడ సిగ్నళ్లు, పాయింట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన చిత్రాలను వేసి అధికారులకు అందజేయాలన్న నిబంధన సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఇప్పటికే అధిక గంటలు పనిచేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతుంటే కొత్త ఉత్తర్వులు వారిని మరింత కుంగదీస్తున్నాయన్నారు. అధికారులు వేధింపులను విడనాడాలన్నారు. కౌన్సెలింగ్ పేరుతో సిబ్బందిని అధికారులు వారి చుట్టూ తిప్పుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అవసరమైన సెలవులు ఇవ్వకుండా, అలవెన్సుల్లో కోతలు విధించడం దారుణమని ధ్వజమెత్తారు. రన్నింగ్రూముల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్కు చెందిన లోకో రన్నింగ్ సిబ్బంది సంఘం కార్యదర్శి బాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్