ఓట్ల లెక్కింపులో అవకతవకలు అవాస్తవం
‘ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న మాటల్లో వాస్తవం లేదని, రేయింబవళ్లు ఎంతో కష్టపడి ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నిక్కచ్చిగా విధులు...
మాట్లాడుతున్న ఐకాస జిల్లా అధ్యక్షుడు దివాకర్రావు, నాయకులు కుళ్లాయప్ప, పీఎస్ ఖాన్, తదితరులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న మాటల్లో వాస్తవం లేదని, రేయింబవళ్లు ఎంతో కష్టపడి ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నిక్కచ్చిగా విధులు నిర్వర్తించిన అధికారులపై నిందలు వేయడం సరికాదని ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్ దివాకర్రావు, సెక్రటరీ జనరల్ పీఎస్ ఖాన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప అన్నారు. సోమవారం అనంత కృష్ణకళా మందిర్లోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. వైకాపా అభ్యర్థి రవీంద్రారెడ్డి ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని తప్పు పట్టడం తమను ఎంతో బాధిస్తోందన్నారు. కలెక్టర్, ఎస్పీ, కొందరు అధికారులు తెదేపా అభ్యర్థికి అనుకూలంగా పని చేశారన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఈనెల 9 నుంచి ఏప్రిల్ 5వ తేదీ దాకా విధి నిర్వహణలో నల్లబ్యాడ్జీలు ధరిస్తామని, స్వయానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మికి నోటీసు ఇచ్చామని చెప్పారు.
నేటి నుంచి వర్క్ టు రూల్
ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 21 నుంచి ఏప్రిల్ 5వ తేదీ దాకా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, విధి నిర్వహణలో వర్క్ టు రూల్ అమలు చేస్తామని ప్రకటించారు. ఇది నిరసనలో భాగమేనన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దారు, రెవెన్యూ ఉద్యోగులు తప్పక పాటిస్తారన్నారు. ప్రజలు ముందుగానే గమనించాలన్నారు.ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటలు దాకా మాత్రమే పని చేస్తారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి మారుతీప్రసాద్రెడ్డి, కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సోమశేఖర్, ఉపాధ్యక్షుడు అక్రం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు