logo

తెదేపా శ్రేణుల నిరసన హోరు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా మార్పు రాలేదా అని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 21 Mar 2023 03:35 IST

అనంతపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న తెలుగు యువత పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, ఇతర నాయకులు  

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా మార్పు రాలేదా అని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో తెదేపాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయస్వామిలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. అనంతపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. హిందూపురంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెనుకొండలో తెదేపా, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినందుకు అసెంబ్లీలో రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలను విమర్శించారు. ఓబుళదేవర చెరువులో తెదేపా నాయకులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని