Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి.
ఇటీవల ధర్మవరంలో వెలుగుచూసిన నకిలీ నోటు
ధర్మవరం, న్యూస్టుడే : చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. నోట్ల రద్దు అనంతరం కొన్నేళ్ల పాటు తగ్గినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. దందాతో చిరువ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో వెలుగుచూస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఆయా నోట్లపై పెన్నుతో మార్కింగ్ వేసి ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో చించి పడేస్తున్నారు. సామాన్యులు ఏది అసలో, ఏది నకిలీనో తెలుసుకోలేక మోసపోతున్నారు.
ధర్మవరంలో మూడు నెలలుగా దొంగ నోట్ల మార్పిడి ఊపందుకుంది. రూ.500కు చిల్లర ఇవ్వాలంటేనే ధర్మవరంలో నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఈప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. దీంతో నకిలీ నోట్లు ఎవరు ఇచ్చారో చెప్పలేని పరిస్థితి తలెత్తుతోంది. మోసపోయినవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా జంకుతున్నారు. బాధితులంతా ఎక్కువగా శాతం చిరువ్యాపారులు, కార్మికులే. పెద్ద వ్యాపారుల వద్ద లెక్కింపు యంత్రాలు ఉండటంతో సులువుగా దొంగనోట్లను గుర్తిస్తున్నారు.
40 శాతం కమీషన్..!
తాడిమర్రి మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దొంగ నోట్ల డొంక కదిలింది. కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వారు నోట్లు చలామణి చేస్తున్నట్లు కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కడప, బెంగళూరు, ప్రాంతాల నుంచి ధర్మవరానికి నోట్లు తీసుకొచ్చి.. కొందరు దళారులను ఏర్పాటు చేసుకొని తమ పనిని అత్యంత సులువుగా కానిచ్చేస్తున్నారు. దళారులకు 40 శాతం మేర కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
నిఘా పెంచుతాం..
- హుస్సేన్పీరా, ఇన్ఛార్జి డీఎస్పీ, ధర్మవరం
నకిలీనోట్ల చలామణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి కట్టడి చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్