బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. బీసీలకు కష్టమొస్తే అండగా నిలిచేది, భవిష్యత్తులో ఆదుకోవాలన్నా భరోసానిచ్చేది తెదేపానేనని, అందుకు బీసీలు మద్దతుగా నిలబడాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ
కదిరి పట్టణంలో లోకేశ్ పాదయాత్రలో కందికుంట వెంకటప్రసాద్, అత్తార్ చాంద్బాషా, పరిటాల శ్రీరామ్ తదితరులు
ఈనాడు డిజిటల్, అనంతపురం, కదిరి, న్యూస్టుడే: బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. బీసీలకు కష్టమొస్తే అండగా నిలిచేది, భవిష్యత్తులో ఆదుకోవాలన్నా భరోసానిచ్చేది తెదేపానేనని, అందుకు బీసీలు మద్దతుగా నిలబడాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర 48వ రోజు సోమవారం ఉదయం జోగన్నపేట నుంచి అల్లుగుండు, మొటుకుపల్లి, కౌలేపల్లి, బేరిపల్లి క్వార్టర్స్, నిజాంవలీ కాలనీ, జీమాను సర్కిల్, ఇక్బాల్రోడ్డు మీదుగా పార్థసారథి కాలనీ వరకు కొనసాగింది. కదిరి మండలం కౌలేపల్లి వద్ద పీవీఆర్ ఫంక్షన్ హాల్ల్ో బీసీ సామాజికవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వడ్డెర, పట్ర, నాయీబ్రాహ్మణ, గౌడ తదితర కులాలకు సంబంధించి ప్రజలు తాము పడుతున్న కష్టాలను లోకేశ్కు వివరించారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు తదనంతర పాలనతో ఎదురైన పరిణామాలు, పడుతున్న ఇబ్బందులను అభిమాన నాయకుడితో ఏకరవుపెట్టుకున్నారు. పాత పథకాల పునరుద్ధరణ, బలహీనవర్గాలకు రక్షణ, ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలతోపాటు రాజకీయ చైతన్యానికి అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన జనం సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని లోకేశ్ వారికి సమాధానం ఇచ్చారు.
దివ్యాంగులతో ముచ్చట్లు..
యువగళం పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో కదిరి మండలం మొటుకుపల్లిలో ఆర్డీటీ ఏర్పాటు చేసిన బధిర పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగులను లోకేశ్ కలిశారు. సరదాగా వారితో కాసేపు ముచ్చట్లు పెట్టారు. పిల్లలకు మిఠాయిలు అందజేసి ఆప్యాయతతో పలకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు లోకేశ్ కుమారుడు దేవాన్ష్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆర్డీటీ డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో దివ్యాంగుల అభివృద్ధికి సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు లోకేశ్కు వివరించారు.
మోటుకపల్లిలో ఆర్డీటీ బధిరుల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటిస్తున్న లోకేశ్
ఖాద్రీశుడి దర్శనం..
సాయంత్రం 7 గంటల సమయంలో నారాలోకేశ్ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం భృగుతీర్థం (కోనేరు) పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. డీఎస్పీ కార్యాలయం ఎదురుగా విడిది కేంద్రం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో లోకేశ్ వెంట కదిరి ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా, పరిటాల శ్రీరామ్, మాజీ జడ్పీ ఛైర్మన్ పూలనాగరాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అంబికా లక్ష్మీనారాయణ, నాగప్ప, గంగయ్య, శంకర తదితరులు పాల్గొన్నారు.
నేటి పాదయాత్ర వివరాలు
కదిరి: తెదేపా యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు.. ఇప్పటి వరకు నడిచిన దూరం 612.5 కి.మీ. సోమవారం 9.8 కి.మీ. దూరం నడక సాగించారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాలో పాదయాత్ర సాగనుంది. ఉదయం 8 గంటలకు కదిరి ఆర్డీవో ఆఫీసు వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.15కు గట్ల వద్ద టిడ్కో గృహాల పరిశీలన, లబ్ధిదారులతో బేటీ, 8.45 గంటలకు అలీపూర్తండా వాసులతో మాటామంతి, 10.40 గంటలకు ముత్యాలచెరువు మాటామంతి, 11.30కు అక్కడే భోజన విరామం, 12.30 గంటలకు ముత్యాలచెరువు ప్రాంతం నుంచి బయల్దేరి 3.30కి పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రవేశిస్తారు. 3.45 గంటలకు పులగంపల్లిలో జనంతో మాట్లాడతారు. 4.45 గంటలకు వనికివారిపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం