అన్నదాత గుండెకోత
జిల్లాలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలకు భారీగా నష్టం జరిగింది. మొత్తంగా రూ.93 కోట్ల విలువైన పంటలను కోల్పోవడంతో రైతులకు కన్నీటి కడగండ్లు మిగిల్చింది.
భారీగా దెబ్బతిన్న ఉద్యాన పంటలు
అనంతలో రూ.93 కోట్లపైగా నష్టం
విరిగిన అరటి మొక్కలు
జిల్లా వ్యవసాయం, న్యూస్టుడే: జిల్లాలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో పంటలకు భారీగా నష్టం జరిగింది. మొత్తంగా రూ.93 కోట్ల విలువైన పంటలను కోల్పోవడంతో రైతులకు కన్నీటి కడగండ్లు మిగిల్చింది. ప్రధానంగా ఉద్యానపంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన అరటి నేలకొరిగింది. చీనీ, నిమ్మ చెట్లు విరగపడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కలింగర, కర్బూజ, టమోటా, కూరగాయలు తోటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కళ్లెదుటే నిలువునా కూలడంతో సర్వం కోల్పోయామని ఉద్యాన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉరవకొండ, కూడేరు, అనంతపురం గ్రామీణం, గార్లదిన్నె, గుంతకల్లు, గుత్తి, పామిడి, రాయదుర్గం, బొమ్మనహాళ్, నార్పల, యల్లనూరు, పుట్లూరు, రాప్తాడు, శింగనమల మండలాల పరిధిలోని 1,599 మంది ఉద్యాన రైతులకు సంబంధించి 1,938 హెక్టార్లలో రూ.76.18 కోట్లు నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యానశాఖ అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. ప్రధానంగా అరటి 1,108 హెక్టార్లలో రూ.66.55 కోట్లు, మిరప 170 హెక్టార్లలో రూ.66 లక్షలు, మామిడి 178 హెక్టార్లలో రూ.2.91 కోట్లు, చీనీ 280 హెక్టార్లలో రూ.3.57 కోట్లు, టమోటా 76 హెక్టార్లలో రూ.కోటి నష్టం కలిగింది. నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు డీడీహెచ్ తెలిపారు.
ఇతర పంటలు..: వరి, మొక్కజొన్న, కొర్ర, జొన్న, తదితర పంటలకు భారీగా నష్టం జరిగింది. పుట్లూరు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు, శింగనమల, అనంతపురం గ్రామీణం, గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, యల్లనూరు, రాప్తాడు, విడనపనకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, బొమ్మనహాళ్, కూడేరు మండలాల పరిధి 92 గ్రామాల్లో 3,010 హెక్టార్లలో రూ.17.4 కోట్లు పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి చంద్రనాయక్ తెలిపారు. అందులో వరి 680 హెక్టార్లలో రూ.6.5 కోట్లు, మొక్కజొన్న 1,813 హెక్టార్లలో రూ.8.2 కోట్లు, కొర్ర 221 హెక్టార్లలో రూ.కోటి, జొన్న 165 హెక్టార్లలో రూ.8 లక్షల మేరకు రైతులు నష్టపోయారు. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఆశలన్నీ అరగంటలో ఆవిరి..
- మధుసూదన్రెడ్డి, అరటి రైతు, దోసలేడు, పుట్లూరు మండలం
పదేళ్ల కాలంలో చేసిన అప్పులన్నీ తీరుతాయని నెల రోజులుగా వేచి ఉన్నా. ఆశలన్నీ అరగంటలోనే ఆవిరయ్యాయి. నాలుగున్నర ఎకరాల్లో రూ.10 లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంట పడిపోయింది. టన్ను రూ.25 వేలతో వ్యాపారులు అడిగినా ఇవ్వలేదు. దాదాపు వంద టన్నుల పంట నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోకపోతే జీవనం కష్టమే.
1.5 టన్నుల కాయలు రాలిపోయాయి
- గోవిందరాజులు, రైతు, మల్లాపురం
4.5 ఎకరాల్లో 320 మామిడి మొక్కలు నాటాను. అకాల వర్షానికి ప్రతి చెట్టు నుంచి 10కిలోల చొప్పున సుమారు ఒకటిన్నర టన్నుల వరకు మామిడి కాయలు రాలిపోయి అపార నష్టం వాటిల్లింది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు