గుత్తి- పెండేకల్లు బైపాస్లైన్కు రూ.351 కోట్లు
భారత రైల్వేలో మొట్టమొదట లెవల్ క్రాసింగులు లేకుండా నిర్మించిన గుత్తి- పెండేకల్లు బైపాస్ సింగిల్లైన్కు తోడుగా డబుల్లైన్ను నిర్మించడానికి ప్రభుత్వం రూ.351.80 కోట్లను కేటాయించినట్లు డీఆర్ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు.
మాట్లాడుతున్న డీఆర్ఎం వెంకటరమణారెడ్డి, అధికారులు
గుంతకల్లు, న్యూస్టుడే: భారత రైల్వేలో మొట్టమొదట లెవల్ క్రాసింగులు లేకుండా నిర్మించిన గుత్తి- పెండేకల్లు బైపాస్ సింగిల్లైన్కు తోడుగా డబుల్లైన్ను నిర్మించడానికి ప్రభుత్వం రూ.351.80 కోట్లను కేటాయించినట్లు డీఆర్ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలోని సమావేశపు మందిరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెక్షన్లోని 29.2 కి.మీ.లు డబుల్లైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. సికింద్రాబాద్, బెంగళూరులకు త్వరగా రైళ్లు చేరుకోవడానికి ఈ డబుల్లైన్ మార్గం ఉపయోగపడుతుందన్నారు. గుంటూరు- గుంతకల్లు సెక్షన్లో జరుగుతున్న డబుల్లైన్ పనుల్లో భాగంగా గుంతకల్లు శివారులో నిర్మిస్తున్న బైపాస్లైన్ పనులు జులై నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఎర్రగుంట్లలో నిర్మిస్తున్న బైపాస్లైన్ పనుల సర్వేను గతిశక్తి విభాగం ఇంజినీర్లు చేపట్టారన్నారు. తిరుపతి- పాకాల, పాకాల- కాట్పాడి మధ్య డబుల్లైన్లను నిర్మించడానికి ప్రస్తుతం సర్వే జరుగుతోందని చెప్పారు. ధర్మవరం- పాకాల మధ్య డబుల్లైన్ను నిర్మించాల్సి ఉందని, రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పనులను చేపడతామని తెలిపారు. గుంతకల్లులోని జంక్షన్లో అన్ని ప్లాట్ఫారాలకు చెందిన లైన్లను అనుసంధానం చేసే పనులను చేపట్టాల్సి ఉందన్నారు. ధర్మవరం రైల్వేగేటు వద్ద రోడ్డు అండర్ వంతెనను నిర్మించడానికి సర్వేను పూర్తిచేసి నిధుల మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. ప్రస్తుతం నంద్యాల - గుంటూరు మధ్య డబుల్లైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్, సీనియర్ డీసీఎం ప్రశాంత్కుమార్, ప్రోటోకాల్ ఫిర్యాదుల విభాగం ఇన్స్పెక్టర్ మురళీధర, కమర్షియల్ ఇన్స్పెక్టర్ హేమంత్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?