ట్యాబ్ పాఠాలు.. నిర్వహణ లోపాలు!
ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్ ట్యాబ్లు సక్రమంగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లాలో 21,632 మంది విద్యార్థులు, 3,991 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు పంపిణీ చేశారు.
అనంతపురం విద్య, న్యూస్టుడే
ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన బైజూస్ ట్యాబ్లు సక్రమంగా పనిచేయడం లేదు. అనంతపురం జిల్లాలో 21,632 మంది విద్యార్థులు, 3,991 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. వాటి వినియోగం, నిర్వహణపై శిక్షణ ఇవ్వలేదు. కొందరు పాఠాలు పక్కన పెట్టి, యూట్యూబ్ వీడియోల కోసం ప్రయత్నించడంతో బైజూస్ కంటెంట్ తొలగిపోయింది. మరికొన్ని ట్యాబ్లలో ఎర్రర్ వస్తోందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. పాడైన ట్యాబ్లు మరమ్మతు చేయడానికి ఇటీవల నిపుణులు వచ్చారు. బడిలో నేర్చుకొన్న పాఠాలను విద్యార్థులు ఇంటికెళ్లి.. మరిన్ని అంశాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేశారు. నిర్వహణ, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కార్యక్రమం గాడి తప్పుతోంది. ఇప్పటి వరకు ట్యాబుల్లో గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల పాఠాలు వస్తున్నాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాఠాలు రావడంలేదు. విద్యార్థులు రోజుకు కనీసం 2 గంటల సేపు ట్యాబ్లో పాఠాలు నేర్చుకోవాలని.. పాఠశాలకూ తీసుకొని రావాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు తెచ్చినా... వాటి ద్వారా బోధించడంలేదు. కొందరు ఇంటర్నెట్ కోసం ట్యాబ్లో సిమ్ అమర్చడానికి ప్రయత్నించారు. ఇతర అంశాల కోసం శోధిస్తుండటంతో పాడవుతున్నాయి. ప్రచారం కోసం ట్యాబ్లు పంపిణీ చేశారని.. వాటి నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
సచివాలయ సిబ్బందికి మరమ్మతు బాధ్యత
విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు పాడైతే పాఠశాల సమీపంలో, లేదంటే ఇంటికి సమీపంలో ఉన్న వార్డు/గ్రామ సచివాలయంలో సమాచారం అందించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. పాడైన వాటిని అందజేస్తే, వార్డు కార్యదర్శి వాటిని బాగు చేయించి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కస్తూరీ విద్యాలయంలో 8వ తరగతి విద్యార్థినులకు పంపిణీ చేసిన బైజూస్ ట్యాబ్లు పని చేయలేదు. దీంతో వాటిని డీఈవో కార్యాలయానికి తీసుకొచ్చారు. అధికారులు వాటిని మరమ్మతు చేయించారు. రెండు రోజుల్లో 980 ట్యాబులను సరిచేశారు.
అనంతపురం కోర్టు రోడ్డులోని నగరపాలక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాబ్ల వినియోగంపై ఆరా తీశారు. సక్రమంగా పనిచేయడం లేదని, ఉపాధ్యాయులు తమకు చెప్పడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు ట్యాబ్లపై అవగాహన లేదని ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.
కొరవడిన పర్యవేక్షణ
ట్యాబ్ల ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకొంటున్నారా.. లేదా.. పరీక్షలు ఎలా రాస్తున్నారు. విద్యార్థుల సమాధానాలు ఎలా ఉన్నాయి... తదితర అంశాలను పర్యవేక్షించేవారు లేరు. శిక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు. విద్యార్థులు ట్యాబ్లు ఎన్నిగంటలు వినియోగించారో వాటి వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ట్యాబ్ల నిర్వహణపై ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వలేదు.
వినియోగించేలా చర్యలు
ట్యాబ్లు పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలకు ట్యాబ్లు తీసుకురావాలని.. విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించాం. ఎక్కడైనా పాడైతే వెంటనే బాగు చేయిస్తున్నాం.
సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM