కాలువ నీరున్నా.. ప్రయోజనం సున్నా!
ముదిగుబ్బ మండలం చుట్టూ నీరున్నా అన్నదాతలకు మాత్రం సాగునీటి కష్టాలు తీరడం లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నీరు వెళ్తున్నా చెరువులకు నింపకపోవడంతో ఏటేటా పంటల సాగు తగ్గిపోతోంది.
వలసబాటలో గ్రామస్థులు
ముదిగుబ్బలో నీరు ఇలా..
ముదిగుబ్బ, న్యూస్టుడే: ముదిగుబ్బ మండలం చుట్టూ నీరున్నా అన్నదాతలకు మాత్రం సాగునీటి కష్టాలు తీరడం లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నీరు వెళ్తున్నా చెరువులకు నింపకపోవడంతో ఏటేటా పంటల సాగు తగ్గిపోతోంది. ఇక్కడి ప్రజలు ఉపాధి దొరక్క బెంగళూరు, పులివెందుల ప్రాంతాలకు వలసపోవడం ఇక్కడ పరిపాటిగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద మండలం ముదిగుబ్బ. 86 గ్రామాలు, 62 వేల మంది జనాభా ఉన్నారు. అడవిబ్రాహ్మణపల్లితండా సమీపంలో 1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన యోగివేమన జలాశయం కింద 12 వేల ఎకరాల ఆయకట్టుకి నీరందుతోంది. ఏటా వర్షాకాలంలో జలాశయం గేట్లు ఎత్తడంతో వేల క్యూసెక్కుల నీరంతా వృథాగా చిత్రావతిలోకి పోతోంది. ఆయకట్టు భూములు సాగునీటితో కళకళలాడుతున్నా మిగిలిన గ్రామాల్లో మాత్రం సేద్యానికి సాగునీటి కొరత ఏర్పడింది. ప్రధాన ఆధారమైన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నీటితోనైనా చెరువులు నింపితే భూగర్భజలాలు పుష్కలంగా లభించి వ్యవసాయం సాగుతోనైనా వలసలు తగ్గే అవకాశముంది. ముదిగుబ్బ-బుక్కపట్నం సరిహద్దులో 2.41 టీఎంసీల సామర్థ్యంతో నూతనంగా జలాశయాన్ని నిర్మిస్తున్నా కొండగట్టుపల్లి నుంచి మల్లేపల్లి పంచాయతీ వరకు ఉన్న 15గ్రామాల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ముదిగుబ్బ మండలంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద 14వ ప్యాకేజీతో మలకవేముల నుంచి నాగారెడ్డిపల్లి వరకు 2 కిలోమీటర్లు కాలువ నిర్మించారు. రెండు గ్రామాల పరిధిలో నీరు పోతున్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 14వ ప్యాకేజీ కింద రెండో విడత కదిరి మండలంలోని పట్నం నుంచి తలుపుల మండలం ఓబుళరెడ్డి గ్రామం వరకు నిర్మించారు. ముదిగుబ్బ సరిహద్దు మీదుగా కాలువ నీరు వెళ్తున్నా చెరువులు నింపడంలేదు. కాలువ కింద కొండగట్టుపల్లి, చెంచుగారిపల్లి, చెంచుగారిపల్లితండా, మద్దన్నగారిపల్లి, పైపేడు, పెద్దన్నగారిపల్లి, తప్పెటవారిపల్లి, సిరిగారిపల్లి, సీలోళ్లపల్లి గ్రామాల చెరువులకు నీరందడం లేదు.
పొలం వదిలేసి బెంగళూరుకు వచ్చాం
మాకున్న ఏడెకరాల భూమిలో వేరుసెనగ, ఇతర పంటలు సాగుచేసేవాళ్లం. క్రమంగా భూగర్భ జలాలు తగ్గిపోవడం, నష్టాలు రావడంతో వ్యవసాయం వదిలేయాల్సి వచ్చింది. ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో బతుకు తెరువులేక మూడేళ్ల కిందట బెంగళూరుకు వలస వచ్చాం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు రూ.20 వేల జీతం. భార్య వస్త్రదుకాణ పరిశ్రమ (గార్మెంట్)లోకి వెళ్తోంది.
రామాంజనేయులు, మద్దన్నగారిపల్లి
* ఈ చిత్రంలో తాళంవేసి కనిపిస్తున్నది మద్దన్నగారిపల్లిలోని వెంకటనారాయణకు చెందిన ఇల్లు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పది ఎకరాల భూమి ఉన్నా సేద్యం చేసేందుకు సాగునీరు లేక బీడుగా వదిలేశారు. ఉపాధి కోసం ఈ నెల 4న భార్యభర్తలిద్దరూ బెంగళూరుకి వలస వెళ్లారు. ఇలా గ్రామంలో సుమారు 20కుటుంబాల వరకు బెంగళూరుకి వెళ్లి కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
ముదిగుబ్బ పరిధిలోని మద్దన్నగారిపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయం ఆధారంలేక వలసలు వెళ్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కింద ఉన్న ముదిగుబ్బ గ్రామాలకు నీరు విడుదల చేయాలంటే ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మైనర్ ఇరిగేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
కైలాష్, ఇరిగేషన్ ఏఈ, ధర్మవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
[ 19-04-2024]
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?