logo

స్టేషన్‌లో సర్కారు వాహనాలు

ఇంటింటికి చౌక బియ్యాన్ని సరఫరా చేయాల్సిన బియ్యం వాహనాలు కొన్ని నెలలుగా కూడేరు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్నాయి.

Published : 24 Mar 2023 06:05 IST

ఇంటింటికి చౌక బియ్యాన్ని సరఫరా చేయాల్సిన బియ్యం వాహనాలు కొన్ని నెలలుగా కూడేరు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్నాయి. కూడేరు మండలానికి 8 బియ్యం వాహనాలు మంజూరయ్యాయి. వాటిలో మూడు వాహనాలకు సంబంధించిన ఎండీయూలు తమకు గిట్టుబాటు కావడం లేదని రాజీనామా చేశారు. దీంతో అధికారులు మూడు వాహనాల్లో రెండింటిని రక్షణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో, ఒక వాహనాన్ని ఇప్పేరులో నిలిపారు. ఈ కారణంగా కార్డుదారుల ఇళ్లకు బియ్యం అందడం కష్టంగా మారింది. ఈ విషయమై సీఎస్‌డీటీ లక్ష్మీదేవి వివరణ కోరగా మూడు వాహనాలను అందుబాటులోకి తేవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా వాటిని వినియోగంలోకి తెస్తామన్నారు.

న్యూస్‌టుడే, కూడేరు(ఉరవకొండ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని