నష్ట పరిహారం నిబంధనలు సడలించాలి
పంట నష్ట పరిహారం నిబంధనలు సవరించి నేలరాలిన మామిడి, చీనీ, దానిమ్మ, సపోటా, తడిసిన మిరపకు కూడా పరిహారం ఇవ్వాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ రైతు సంఘం డిమాండు
ఆజాద్నగర్, న్యూస్టుడే: పంట నష్ట పరిహారం నిబంధనలు సవరించి నేలరాలిన మామిడి, చీనీ, దానిమ్మ, సపోటా, తడిసిన మిరపకు కూడా పరిహారం ఇవ్వాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల, వడగండ్ల వానకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఉద్యాన పంటలకు భారీగా నష్టం జరిగిందన్నారు. అనంతపురం, నార్పల, పుట్లూరు, కూడేరు, ఉరవకొండ, గార్లదిన్నె, శింగనమల, గుత్తి, గుంతకల్లు, యల్లనూరు, రాప్తాడు తదితర మండలాల్లో సుమారు 4,47,393 హెక్టార్లలో రూ.211.91కోట్లకు పైగా దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు ప్రాథమిక అంచనా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వ నిబంధనల ఆధారంగా మాత్రమే అంచనాలు వేస్తున్నామని చెప్పడంతో పరిహారం అందుతుందో లేదోనని రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!