హామీలు ఏమయ్యాయి?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
193 చెరువులు నింపుతామన్నారు..
నాలుగేళ్లలో ఒక్కటైనా నెరవేర్చని జగన్రెడ్డి
50వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్
ఓడీసీ మండల కేంద్రంలో అభివాదం చేస్తున్న లోకేశ్
ఈనాడు డిజిటల్, అనంతపురం, పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు, న్యూస్టుడే: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 50వ రోజు శనివారం ఓడీసీ మండలం ఒనుకువారిపల్లి నుంచి రామయ్యపేట వరకు కొనసాగింది. ఓడీసీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 2017లో పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి హంద్రీనీవా ద్వారా 193 చెరువులకు నీరందిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తలేదన్నారు. రెండేళ్ల కిందట జీవో ఇచ్చి రూ.864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పలు చెప్పారన్నారు. ఇప్పటివరకు ఒక గంప మట్టి తీశారా అంటూ లోకేశ్ ప్రశ్నించారు. మారాల రిజర్వాయర్ కాలువలు పూర్తిచేసి ఆయకట్టుకు నీరిస్తామని చెప్పిన హామీ తుంగలో తొక్కారన్నారు. పుట్టపర్తిని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని బీరాలు పలికిన జగన్రెడ్డి పట్టించుకోలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులకు నీరు అందిస్తామన్నారు.
మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ..
వలసలు నివారిస్తాం..
స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కేరళ వెళ్తున్న వారిలో కొందరు భిక్షాటన చేస్తున్న దుస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెదేపా హయాంలోనే కియా లాంటి దిగ్గజ సంస్థను జిల్లాకు తీసుకొచ్చామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఇలాంటి సంస్థలను పుట్టపర్తికి తీసుకొచ్చి..ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను నివారిస్తామన్నారు.
దుద్దుకుంట కాదు.. దోపిడీకుంట
పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అవినీతిలో దిట్ట అని లోకేశ్ ఆరోపించారు. అందుకే దుద్దుకుంట కాకుండా దోపిడీకుంట అని పేరు మార్చినట్లు తెలిపారు. పుట్టపర్తి చుట్టుపక్కల ఎవరూ లేఅవుట్ వేసినా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనన్నారు. లేఅవుట్ ఏర్పాటు చేసుకున్న కొందరు టీచర్ల నుంచి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే పుట్టపర్తిలో ఒక రోజు ఉంటే హైదరాబాద్లో వారం ఉంటారన్నారు. నియోజకవర్గ సమస్యలు గాలికొదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
బహిరంగసభలో చేతులెత్తి నినదిస్తున్న జనం
అపూర్వ స్పందన
యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. వారిని అప్యాయంగా పలకరిస్తూ.. ఫొటోలు దిగుతూ ముందుకుసాగారు. రైతులు, లారీ డ్రైవర్లు, ముస్లింలు, గిరిజనులు, నిరుద్యోగులు లోకేశ్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
నేటి పాదయాత్ర వివరాలు
ఆదివారం ఉదయం 8 గంటలకు రామయ్యపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.30 రామయ్యపేటలో మహిళలతో సమావేశం, 10.40 గంటలకు అల్లపల్లిలో ఆటోవర్కర్లతో భేటీ, 11.20 గౌనిపల్లిలో ఎస్సీలతో సమావేశం, 12.15 పగడాలవారిపల్లిలో బీసీలతో సమావేశం, 1.15 పగడాలవారిపల్లిలో భోజన విరామం, 2.30 యువతతో ముఖాముఖి, సాయంత్రం 4గంటలకు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లిలోకి పాదయాత్ర ప్రవేశం... 5గంటలకు గౌనివారిపల్లిలో స్థానికులతో మాటామంతీ, 5.40 కొరెవాండ్లపల్లిలో గ్రామస్థులతో సమావేశం, 6.30 కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట వద్ద బస చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల