నష్టపరిహారానికి నిబంధనలు అడ్డు!
జిల్లాలో అకాల, వడగళ్ల వానతో పంటలకు ఆపార నష్టం జరిగింది. కళ్లెదుటే చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
33 శాతం పైబడితేనే మంజూరు
ఆందోళనలో బాధిత రైతులు
నేలమట్టమైన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న డీఏవో చంద్రనాయక్, రైతులు
జిల్లా వ్యవసాయం, న్యూస్టుడే : జిల్లాలో అకాల, వడగళ్ల వానతో పంటలకు ఆపార నష్టం జరిగింది. కళ్లెదుటే చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పంటనష్ట సర్వే మొదలైంది. ఈనెల 30 లోపు పూర్తి చేసేందుకు సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు రైతుల జాబితా భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యంతరాలుంటే అర్జీలు తీసుకుంటారు. తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనలు అడ్డుగా మారాయి 33 శాతం పైబడి పంటనష్టం జరిగితేనే పరిహారం అందుతుంది. దీంతో చాలా మంది రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదని తెలుస్తోంది.
పంటనష్టం రూ.228.95 కోట్లు
జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, పుట్లూరు, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు, శింగనమల, అనంతపురం గ్రామీణం, గుంతకల్లు, తాడిపత్రి, పామిడి, నార్పల, యల్లనూరు, రాప్తాడు, విడపనకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, బొమ్మనహాల్, కూడేరు మండలాల్లో వరి, మొక్కజొన్న, అరటి, చీనీ, దానిమ్మ, టమోటా, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. 7,484 హెక్టార్లలో రూ.228.95 కోట్లు పంటనష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమిక అంచనా వేశాయి. 7,512 మంది రైతులను గుర్తించారు. ఏయే పంటకు ఎంతెంత నష్టం వాటిల్లిందో.. క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.
సడలిస్తేనే ప్రయోజనం
పరిహారం మంజూరు చేయటానికి నిబంధనలు విధించారు. ఎంత నష్టం జరిగినా రైతుకు 5 ఎకరాలకే పరిమితం చేశారు. ఈ-పంట నమోదు తప్పనిసరి. 33 శాతంపైబడి నష్టం జరిగితేనే పరిహారం వస్తోంది. లేకపోతే చిల్లిగవ్వ కూడా రాదు. కోతకోసిన తర్వాత, కాలం ముగిసిన పంటలకు ఎటువంటి పరిహారం రాదని ప్రభుత్వం నిబంధన విధించింది. 33 శాతంలోపు నష్టపోయిన రైతులే అధికంగా ఉన్నారు. నిబంధనలు సడలిస్తే రైతుకు మేలు చేకూరుతుందని డివిజన్ స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.
అర్హులందరికీ ఇస్తాం...
చంద్రనాయక్, రఘునాథరెడ్డి (వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు)
జిల్లాలోని 19 మండలాల్లో అత్యధికంగా ఉద్యాన, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ నెలాఖరు లోపు సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతుల నుంచి అర్జీలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ పరిహారం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి