కర్షక హితమే లక్ష్యం
కాకినాడలో ఆన్లైన్ వేదికగా రాష్ట్రస్థాయిలో ఇటీవల నిర్వహించిన ఇన్స్పైర్ పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మూడు ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి.
జాతీయస్థాయి ఇన్స్సైర్ పోటీలకు నమూనాల ఎంపిక
కణేకల్లు, తలుపుల, కదిరి, లేపాక్షి, హిందూపురం అర్బన్, న్యూస్టుడే: కాకినాడలో ఆన్లైన్ వేదికగా రాష్ట్రస్థాయిలో ఇటీవల నిర్వహించిన ఇన్స్పైర్ పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మూడు ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాజెక్టులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. లేపాక్షి మండలం పులమతి జిల్లా పరిషత్తు ఉన్నత, కణేకల్లు బాలికల ఉన్నత, తలుపుల మండలం ఓబుళరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. స్ఫూర్తిగా నిలిచిన ఈ ప్రాజెక్టులు.. వారి గురించి తెలుసుకుందాం.
సులువుగా పిచికారీ
భరద్వాజ్రెడ్డి, 10వ తరగతి (గరికపల్లి), ఓబుళరెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, తలుపుల మండలం
* తల్లి నాగేశ్వరమ్మ, తండ్రి వీరారెడ్డి (లేట్), నానమ్మ నీలావతి సంరక్షణలో ఉంటూ చదువుకొంటున్నాడు. రైతు కుటుంబం
* ఫార్మర్ ప్రెడ్లీ అగ్రికల్చర్ స్ప్రేయర్. తయారీ ఖర్చు రూ.4 వేలు
* రెడ్డి ప్రవీణ్కుమార్, గణిత ఉపాధ్యాయుడు
* రైతులు పంటకు మందు పిచికారి చేయాలంటే స్ప్రేయర్ డ్రమ్మును వీపునకు కట్టుకొని మోస్తూ.. ఒక చేత్తో మందు కొడుతూ, మరో చేత్తో రాడ్డును పైకి కిందకు అనాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. అందుకు బిన్నంగా ఉండాలని ఆలోచించి మూడు చక్రాల వాహనంపై డ్రమ్మును అమర్చి తోస్తూ పోతే డ్రమ్మురాడ్ను మూడుచక్రాల పెడలకు అమర్చడంతో సునాయసంగా మందు పిచికారి అవుతుంది. పైగా స్ప్రేయర్ డ్రమ్మును మోయాల్సిన పనిఉండదు.
* భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణించాలన్నదే లక్ష్యం. రైతులకు ఉపయోగపడే ప్రయోగాలను చేసి కొత్తకొత్త యంత్రాలు రూపొందించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలన్నదే నా ధ్యేయం.
కలుపుతీత.. ప్రత్యేకత
ఫిర్దోస్, 8వ తరగతి, బాలికల ఉన్నత పాఠశాల, కణేకల్లు
* అజంతుల్లా, నసీమా, వ్యవసాయ కుటుంబం
* వరిలో కలుపు తీసే పరికరం (ప్యాడీ వీడర్). తయారీ ఖర్చు రూ.3 వేలు
* బి.లక్ష్మీనారాయణమ్మ (పాఠశాల సహాయకురాలు బయాలజీ), ఎం మల్లికార్జునరావు (హెచ్ఎం)
* వరి నాట్లు వేశాక 45 రోజుల లోపు కలుపు తీయడంలో కూలీల కొరతను అధిగమించి, వ్యయ భారాన్ని తగ్గించుకోవచ్చు. కూలీలకయ్యే ఖర్చు చాలా వరకు ఆదా అవుతుంది. కలుపు బురదలో కలిసిపోవడం వల్ల సేంద్రీయ ఎరువుగానూ ఉపయోగపడుతుంది.
* వైద్యురాలు కావాలన్నది నా లక్ష్యం. ఉపాధ్యాయుల సహకారంతో వరి సాగులో కూలీల కొరత నివారించేలా రైతులకు ప్రయోజనం చేకూరేలా తక్కువ ఖర్చుతో పరికరాలు రూపొందించే ప్రాజెక్టులకు రూపకల్పన దిశగా అడుగులు వేస్తా.
దిగుబడుల రక్షణ
* ఎస్.రహీం, 10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పులమతి, లేపాక్షి మండలం
* ముబారక్, రషీదా, వ్యవసాయ కుటుంబం
* వన్యప్రాణుల నుంచి పంట పొలాలను వినూత్నంగా ఎలా కాపాడాలో తెలిపే నమూనా. తయారీ ఖర్చు రూ.2 వేలు
* గిరిధర్ప్రసాద్ (విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు), కృష్ణమోహన్రెడ్డి (ప్రధానోపాధ్యాయులు), మడకశిర వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ఉపాధ్యాయులు
* వన్యప్రాణుల నుంచి పంట పొలాలను సంరక్షించే కోణంలో రైతులకు మరింత మేలు చేయడం. రైతులు తమ పంటలను కాపాడుకునే ఉద్దేశంతో ఏర్పరిచే విద్యుత్ తీగల ద్వారా కలిగే విద్యుదాఘాతాల నుంచి వన్యప్రాణులకు హాని జరక్కుండా చూడటం.
* పంట పొలాల సంరక్షణకు రైతులు పడుతున్న ఇబ్బందులను సులభ పద్ధతిలో తొలగించేలా ఉపాధ్యాయుల సహకారంతో పలు నమూనాలు రూపొందిస్తా. భవిష్యత్తులో వ్యవసాయ పట్టభద్రునిగా రైతులకు సేవ చేయడమే నా ముందున్న లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!