logo

అన్నదాత బలవన్మరణం

అప్పులబాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురంలో శనివారం చోటుచేసుకుంది.

Published : 26 Mar 2023 03:09 IST

మహేష్‌ (పాతచిత్రం)

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అప్పులబాధ తాళలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురంలో శనివారం చోటుచేసుకుంది. నాలుగో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రాళ్లపల్లి మహేష్‌(32) రైతు. సొంత పొలం ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న, ఆముదం సాగు చేస్తున్నారు. పొలంలో సుమారు ఇరవై బోర్లు తవ్వించేందుకు సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. ఆశించినస్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో అప్పులు గుదిబండగా మారాయి. ఆరు నెలల కిందట రూ.4.50 లక్షలతో లగేజీ వాహనం కొనుగోలు చేసి అద్దెకిచ్చారు. సక్రమంగా బాడుగలు వచ్చేవి కావు. కంతులు కట్టడం కష్టమైంది. అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిళ్లు రావడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం బళ్లారి బైపాస్‌ వద్ద వాహనంలో కూర్చుని పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. సమీపంలోని ఆటో డ్రైవర్లు గమనించి నాలుగో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని