logo

దళిత యువతి హత్య కేసులో నిందితుడికి రిమాండ్‌

నార్పల మండలంలో దళిత యువతి హత్యకేసులో నిందితుడు జాఫర్‌ను రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు.

Updated : 26 Mar 2023 04:05 IST

బుక్కరాయసముద్రం: నార్పల మండలంలో దళిత యువతి హత్యకేసులో నిందితుడు జాఫర్‌ను రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నార్పలలో ఈ నెల 5వ తేదీ నమోదైన యువతి అదృశ్యం కేసులో కాల్‌ రికార్డు ఆధారంగా జాఫర్‌పై అనుమానం వచ్చిందన్నారు. నార్పల, బుక్కరాయసముద్రం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతోనే హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో యువతి అదృశ్యం కేసును నార్పల పోలీసులు హత్యకేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. హత్యకు గురైన యువతి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే నిందితుడు జాఫర్‌ పథకం ప్రకారం ఆమెను బుక్కరాయసముద్రం చిక్కవడియార్‌ చెరువు వద్దకు తీసుకొచ్చి హత్యచేసి నీటిలో పడవేశాడన్నారు. పోస్టుమార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని