logo

నేత్రానందం.. సిడిమానోత్సవం

రాయదుర్గం పట్టణ సమీపంలోని సిద్ధుల కొండపై రససిద్ధేశ్వరస్వామి సిడి మానోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు.

Published : 27 Mar 2023 05:22 IST

సిడిమానోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం పట్టణ సమీపంలోని సిద్ధుల కొండపై రససిద్ధేశ్వరస్వామి సిడి మానోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తుల నడుమ ఉపవాస దీక్షతో ఉన్న యువకుడిని సిడిమానుకు కట్టి మూడు మార్లు తిప్పుతారు. ఆతర్వాత కట్టె బొమ్మను కూడా మూడుమార్లు తిప్పుతారు. దీంతో సిడి మానోత్సవం పూర్తవుతుంది. ఆదివారం కావటంతో రాయదుర్గం పట్టణంతోపాటు పైతోట, వివిధ గ్రామాలకు చెందిన వేలాదిమంది భక్తులు సిద్ధులకొండకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఈశ్వర్‌, పూజారి సిద్ధప్ప, భక్తుల విరాళాలతో అన్నదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని