ప్రజల్లో మార్పు మొదలైంది
వైకాపా నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో మార్పు మొదలైందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న నారా రోహిత్
కొత్తచెరువు, న్యూస్టుడే : వైకాపా నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో మార్పు మొదలైందని సినీ నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో నారా రోహిత్ పాల్గొన్నారు. ఆయన కొత్తచెరువు మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నివాసంలో బసచేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ కోసం అవసరం అనిపించినప్పుడు తప్పక తాను కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. యువ నాయకుడు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల్లో స్పందన భారీగా ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలు తెదేపాతోనే పరిష్కారమవుతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. గత నాలుగేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. మళ్లీ 2024లో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వైకాపా ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయించడం, అణిచివేత ధోరణితో పాలన సాగిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
[ 28-03-2024]
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
[ 28-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. -
జలకళ ఏదీ జగన్?
[ 28-03-2024]
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. -
ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్
[ 28-03-2024]
-
పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన
[ 28-03-2024]
అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఐదేళ్లయినా అధికారులిక్కడే..
[ 28-03-2024]
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. -
మంచినీరు వృథా.. వ్యధ..
[ 28-03-2024]
ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. -
భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?
[ 28-03-2024]
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. -
తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?
[ 28-03-2024]
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు. -
అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ
[ 28-03-2024]
అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్లతో సినిమా తీశారు. -
30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు
[ 28-03-2024]
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు. -
సి-విజిల్ ఫిర్యాదులు పరిష్కరించండి
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. -
ఖాద్రీశుడి సమ్మోహనం
[ 28-03-2024]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు. -
రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు
[ 28-03-2024]
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
[ 28-03-2024]
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. -
పది పరీక్షలకు 2,203 మంది గైర్హాజరు
[ 28-03-2024]
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిసాయి.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య