ఇంకుడు గుంతనూ వదల్లేదు..
భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వభూమి కనిపిస్తే చాలు కలిపేసుకుంటున్నారు. ప్రభుత్వభూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రెచ్చిపోతున్న భూఆక్రమణదారులు..
మొద్దు నిద్రలో అధికారులు
చెక్డ్యామ్ను ఆక్రమిస్తూ కంచె ఏర్పాటు
కదిరి పట్టణం, న్యూస్టుడే: భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వభూమి కనిపిస్తే చాలు కలిపేసుకుంటున్నారు. ప్రభుత్వభూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నా సంబంధిత యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూగర్భ జలాలను పెంచే క్రమంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలనూ ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు మొద్దునిద్రలో ఉన్నారు. నల్లచెరువు మండలం అల్లుగుండు రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు 556లోని ప్రభుత్వం భూమిని గతంలో కొందరు రైతులకు పట్టాలు ఇచ్చారు. ఆ తరువాత అవి భూములు చేతులు మారాయి. సర్వేనంబరు 556లో 6 లెటర్లుగా విభజించి పట్టాలు పంపిణీ చేశారు. 3, 4, లెటర్లలో రెండెకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల భూమిని కొనుగోలు చేసినవారు ఆనుకుని ఉన్న వంకను ఆక్రమించుకునేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాల కొండలను ఆక్రమించుకుని కంచె ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు. కదిరి- మల్లయ్యగారిపల్లికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక దాదాపు ఒకటిన్నర కిలోమీటరు వ్యాపించి ఉంది. కారెడ్డిపల్లి, మల్లయ్యగారిపల్లి, కొత్తపల్లి వైపునుంచి వచ్చే వర్షపునీరు వంక ద్వారా ప్రవహించి సమీపంలోని ఇందుకూరిపల్లి వాగులో కలుస్తుంది. గతంలో ఈవంకపై చెక్డ్యామ్ నిర్మించి, ఇంకుడు గుంతలను తవ్వారు. వంకకు ఆనుకుని ఉన్న రైతులు భూమిని చదునుచేసి బండరాళ్లతో కొన్నిచోట్ల వంకను పూడ్చివేశారు. మిగతా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు నెలలుగా ఈతంతు కొనసాగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ స్థానికులు వాపోతున్నారు.
ఇంకుడు గుంతనూ కలిపేసుకున్నారిలా..
చర్యలు తీసుకుంటాం
అల్లుగుండు పంచాయతీలో గతంలో భూపంపిణీ చేసిన వివరాలను పరిశీలించాలని నల్లచెరువు తహసీల్దార్ను ఆదేశిస్తాం. వంకలు, కొండలు, దారులు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తాం. వంక, ప్రభుత్వభూమిని ఆక్రమించిన వారిపై చర్యలతో పాటు ముళ్లను కంచెను తొలగిస్తాం.
రాఘవేంద్ర, ఆర్డీవో, కదిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా