logo

సందడిగా దసరా ముందస్తు విడుదల వేడుకలు

నాని కథనాయకుడిగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ సినిమా ముందస్తు విడుదల వేడుకలు ఆదివారం నగరంలో సందడిగా జరిగాయి.

Published : 27 Mar 2023 05:22 IST

మాట్లాడుతున్న హీరో నాని, పక్కన కథానాయకి కీర్తి సురేశ్‌ తదితరులు

రుద్రంపేట, న్యూస్‌టుడే: నాని కథనాయకుడిగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ సినిమా ముందస్తు విడుదల వేడుకలు ఆదివారం నగరంలో సందడిగా జరిగాయి. కథానాయిక కీర్తి సురేశ్‌, సముద్రఖని ప్రధాన పత్రాలో నటించిన ఈ సినిమాను ఈనెల 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు వేడుకలను స్థానిక రుద్రంపేట పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. నటీనటులు నాని, కీర్తి సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, అభిమానులు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ మనసుకు దగ్గరగా చిత్రీకరించిన సినిమా దసరా. సంవత్సరం కాలంగా కష్టపడి పనిచేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. పీవీకేకే యాజమాన్యం, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంత అభిమానులు నానీని గజమాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని