తెదేపాతోనే బీసీ సాధికారత
బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం 1983లో వచ్చిందని, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
ఈనాడు డిజిటల్, అనంతపురం - న్యూస్టుడే, సోమందేపల్లి, పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: బీసీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం 1983లో వచ్చిందని, అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్టీఆర్ 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబునాయుడు 34 శాతానికి పెంచి రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. ఎంతో మంది బీసీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. బీసీల సాధికారత తెదేపాతోనే సాధ్యమన్నారు. యువగళం పాదయాత్ర 54వ రోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయునిపల్లి నుంచి పెనుకొండ మండలం హరిపురం వరకు 18.6 కిలోమీటర్లు సాగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పెనుకొండ సమీపంలోని ఓ కళ్యాణమండపంలో వాల్మీకి బోయ, కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బోయ కార్పొరేషన్కు రూ.300 కోట్లు, కురుబ ఫెడరేషన్కు రూ.300 కోట్లు కేటాయించి ఖర్చు చేశామన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కరుబ సామాజిక భవనాలు నిర్మించడానికి అనంతపురం జిల్లాకు అప్పట్లో రూ.10 కోట్లు కేటాయించామన్నారు. 90 శాతం భవనాలు పూర్తయ్యాయని.. వైకాపా అధికారంలోకి వచ్చాక 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఉమ్మడి అనంతలో గొర్రెలు కొనేందుకు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 50 శాతం రాయితీతో రూ.4 లక్షల మేర రుణాలు మంజూరు చేశామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు లేవన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేస్తాం
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఎసీలకు మాత్రమే కేటాయించిన రూ.28 వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లించారని లోకేశ్ ఆరోపించారు. జగనన్న కాలనీలో సెంటు స్థలం పేరుతో రూ.7 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సోమందేపల్లిలోని ఎసీˆ్స కాలనీవాసులు లోకేశ్ను కలిసి సమస్యపై విన్నవించారు. స్థానికంగా చాలామందికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు వాపోయారు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని మూలనపడేశారని.. బిందె రూ.10తో కొనుగోలు చేస్తున్నామని వాపోయారు. లోకేశ్ స్పందిస్తూ నీటిశుద్ధి ప్లాంటును పునరుద్ధరించి.. ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
సోమందేపల్లిలో వినతిపత్రం ఇస్తున్న చేనేత కార్మికులు
వ్యవసాయాన్ని విస్మరించిన ప్రభుత్వం
జగన్ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల్ని చిన్నచూపు చూస్తోందని లోకేశ్ విమర్శించారు. తెదేపా హయాంలో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది రైతులకు డ్రిప్ పరికరాలు 90 శాతం రాయితీతో అందించామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేసిందన్నారు. గతంలో పట్టు రైతులకు డ్రిప్, షెడ్లు, మొక్కలపై రాయితీ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా పట్టు రైతుల సంఘం ప్రతినిధులు లోకేశ్ను కలిసి సమస్యల పరిష్కారంపై వినతిపత్రం అందించారు. లోకేశ్ స్పందిస్తూ తెదేపా అధికారంలోకి రాగానే పట్టు రైతులకు రాయితీ పునరుద్ధరిస్తామన్నారు.
నేటి పర్యటన వివరాలు
పెనుకొండ మండలం హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి గురువారం ఉదయం 8 గంటలకు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం. 8.15 గంటలకు హరిపురం గ్రామస్థులతో మాటామంతీ. 9.35కు ఎర్రమంచి వద్ద కియా కార్ల పరిశ్రమల ఉద్యోగులతో ముఖాముఖి. 10.30కు అమ్మవారిపల్లిలో స్థానికులతో భేటీ. 11.10 గంటలకు యువగళం పాదయాత్ర 700 కిలో మీటర్లకు చేరిక. 11.20కు గుట్టూరులో 700 కిలో మీటర్లకు చేరిన పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకం ఆవిష్కరణ. 12 గంటలకు గుట్టూరులో రహదారి పక్కన వక్కలిగ సామాజిక వర్గీయులతో ముఖాముఖి. ఒంటి గంటకు అక్కడే భోజన విరామం. 2 గంటలకు తిరిగి పాదయాత్ర కొనసాగింపు. 3.30కు యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలోకి ప్రవేశం. 3.45 చెన్నేకొత్తపల్లి సమీపంలో స్థానికులతో మాటామంతీ. 4.20కు కోన రోడ్డులో స్థానికులతో ముఖాముఖి. 4.35 గంటలకు కోన మలుపు వద్ద విడిది కేంద్రానికి చేరిక, రాత్రి బస.
సైకిల్ గుర్తు ముద్రించిన శాలువాతో సన్మానిస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?