నెట్టికంటి ఉత్సవాలకు అవరోధాలు తొలగేనా?
ముందుచూపు లేకుండా గతంలో నిర్మించిన దుకాణాలు ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకే కాకుండా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు అవరోధంగా మారాయి.
షెడ్ల ఏర్పాటుకు నిర్మించిన పునాదులు
గుంతకల్లు, న్యూస్టుడే: ముందుచూపు లేకుండా గతంలో నిర్మించిన దుకాణాలు ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకే కాకుండా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలకు అవరోధంగా మారాయి. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద దుకాణాలు ప్రస్తుతం ఆటంకంగా మారాయి. వాటిని తొలగించి ఆలయానికి దూరంగా నిర్మించే పనులు కార్యరూపం దాల్చలేదు. ఆలయానికి ఆనుకుని ఉన్న మూడు రోడ్ల పక్కన గతంలో 25కు పైగా వాణిజ్య గదులు నిర్మించారు. రోజురోజుకు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వారు ఆలయం ముందు రాత్రి సమయాల్లో నిద్రచేయడానికి ఇపుడున్న స్థలం చాలక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, పల్లకి ఉత్సవాలు నిర్వహించడానికి, తేరు, భక్తులు వెళ్లడానికి రోడ్లు ఇరుకుగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
టెండరు రద్దు చేసి వదిలేశారు
ప్రస్తుతం ఆలయం ముందున్న వాణిజ్యపు సముదాయాన్ని తొలగించి ఆలయానికి చెందిన ప్రధాన రహదారి పక్కన నిర్మించదలచిన అధికారులు నాలుగు సంవత్సరాల కిందట రూ.1.5 కోట్లను కేటాయించి టెండరును నిర్వహించారు. గదులను నిర్మించడానికి రోడ్డుకు ఆనుకుని ఉన్న గుట్టను చదునుచేసే పనులను చేపట్టారు. గుట్టను తొలగించే పనులకు ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపారు. గుట్టను తొలగించడం మంచిది కాదని, గదులను వేరే ప్రదేశంలో నిర్మించాలని సూచించారు. గదులను తొలగించిన తరువాత కొత్త గదులను నిర్మించేవరకు వ్యాపారాలు చేసుకోవడానికి యాత్రికుల వసతి గదుల సముదాయపు ప్రాంగణం చివరలో షెడ్లను నిర్మించడానికి అవసరమైన పునాదులను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇప్పటివరకు కొత్త గదుల నిర్మాణం జరగలేదు. తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు నిర్మించిన పునాదులు పాడైపోతున్నాయి. ఇప్పటికీ ఆలయానికి ఆనుకుని ఉన్న గదులను తొలగించడం, కొత్త గదులను నిర్మించే పనులు చేపట్టక పోవటంతో ఆలయానికి వచ్చే భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయం ముందున్న గదులను తొలగించి రాత్రి సమయంలో ఆలయం ముందు నిద్రచేసే సౌకర్యాన్ని కల్పించాలని, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
దూరంగా నిర్మిస్తాం
ఇప్పుడున్న దుకాణాలను తొలగించి వాటిని ఆలయానికి దూరంగా నిర్మించాలని నిర్ణయించాం. గుట్టను తొలగించడానికి ఉన్నతాధికారులు అంగీకరించలేదు. దీంతో గదుల నిర్మాణం కోసం నిర్వహించిన టెండరును రద్దుచేయాల్సి వచ్చింది. మాస్టర్ ప్లాన్లో పొందుపర్చిన ప్రదేశంలో షాపింగ్ గదులను నిర్మిస్తాం. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాం.
ధనుంజయ, సహాయ కార్యనిర్వహణాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..