జ్యూస్ ఇచ్చి.. చోరీ చేస్తాడు
ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చి స్పృహ తప్పితే వారి వద్ద విలువైన ఆభరణాలు దొంగలిస్తున్న చోరుడిని అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు.
ఒంటరి మహిళలే లక్ష్యం
నిందితుడి పట్టివేత
కేసు వివరాలు వెల్లడిస్తున్న రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి, పక్కన సీఐ విజయభాస్కర్ గౌడ్
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చి స్పృహ తప్పితే వారి వద్ద విలువైన ఆభరణాలు దొంగలిస్తున్న చోరుడిని అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.6.40 లక్షలు విలువ చేసే 124.8 గ్రాముల బంగారు నగలు, రెండు చరవాణులు, నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి సోమవారం రూరల్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్యామచంద్రాపురం గ్రామానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ చంద్రబాబు పదహారేళ్లకే వ్యసనాలకు అలవాటుపడ్డాడు. వంటపని చేస్తుండేవాడు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టాడు.
మత్తులోకి దింపి..
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలను ప్రారంభించాడు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలతో మంచి మాటలతో పరిచయం చేసుకుంటాడు. వారితో డబ్బున్న వ్యక్తిలా నమ్మిస్తాడు. వారి మనస్తత్వాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మాటలు చెబుతాడు. వారికి మరింత దగ్గరై ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తాడు. కొన్నిరోజులపాటు వారితో ఫోన్లో సంభాషిస్తాడు. అతి వినయం, మంచితనం ప్రదర్శిస్తాడు. అవతలివారు ఇంటికి ఆహ్వానించే విధంగా ప్రవర్తిస్తాడు. అలా ఆహ్వానించిన వారి ఇంటికి వెళ్లేటప్పుడే ఓ సీసాలో నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ను తీసుకెళ్తాడు. ఆరోగ్యానికి మంచిదని తాగేలా చేస్తాడు. స్పృహతప్పి పడిపోగానే ఒంటి మీద, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తాడు. తాడిపత్రి, ముషీరాబాద్లో ఈ తరహా చోరీలు చేశాడు. నంద్యాల, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు.
పట్టుబడిందిలా..
గత నెలలో అనంతపురం నగరానికి చెందిన ఓ మహిళ కదిరి నుంచి బస్సులో వస్తుండగా అదే బస్సులో నిందితుడు ప్రయాణిస్తూ పరిచయం పెంచుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన మహిళ చిరునామా, ఫోన్ నెంబర్లు ఇచ్చి ఇంటికి ఆహ్వానించింది. ఆమెతో జ్యూస్ తాగించాడు. స్పృహతప్పి పడిపోయాక మెడలో, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయభాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సై నబీరసూల్, సిబ్బంది శివన్న, జయరాం, పాండవలు బృందంగా ఏర్పడి మంగళవారం రాత్రి అనంతపురం ఆర్టీసీ బస్టాండులో నిందితుడిని అరెస్టు చేశారు. జిల్లా కోర్టు రిమాండు విధించింది. అంతర్రాష్ట్ర నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
[ 19-04-2024]
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు