చిరుద్యోగుల నియామకం ఉత్తర్వులేనా?
సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే దిక్కులేదు[. నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఓవైపు నియామక ఉత్తర్వులు ఇవ్వరు.. మరోవైపు గతంలో పనిచేసిన సమయానికి వేతనాలు ఇవ్వకపోగా తాజాగా పనిచేసిన వారికీ వేతనాలు ఇవ్వలేదు.
సాంఘిక సంక్షేమశాఖలో వింత విధానం
సాంఘిక సంక్షేమ భవనం
అనంత సంక్షేమం, న్యూస్టుడే: సాంఘిక సంక్షేమశాఖలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే దిక్కులేదు[. నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఓవైపు నియామక ఉత్తర్వులు ఇవ్వరు.. మరోవైపు గతంలో పనిచేసిన సమయానికి వేతనాలు ఇవ్వకపోగా తాజాగా పనిచేసిన వారికీ వేతనాలు ఇవ్వలేదు. విద్యార్థుల ఆకలి తీర్చే ఉద్యోగులకు కడుపులు కాలుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని కళాశాల వసతి గృహాల్లో పనిచేస్తున్న వంట మనుషులు, కమాఠీలు ఇప్పటికే విధులు నిర్వహిస్తుంటే వారందర్నీ నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడు నియామకాలు చేస్తారో, వేతనాలు ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళన చిరుద్యోగుల్లో నెలకొంది.
నాలుగు నెలలవుతున్నా..
రాష్ట్రంలోని ఏడు పాత జిల్లాలను పరిగణనలోకి తీసుకొని అప్పటికే ప్రీమెట్రిక్ హాస్టళ్లలో విధులు నిర్వహిస్తుంటే వారి సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లాలోని 24 కళాశాలల వసతి గృహాల్లో 41 మందిని ఎంపిక చేసి వారిని ఆప్కోస్లోకి అనుసంధానం చేయాలని ఉత్తర్వులిచ్చారు. గతంలో వారికి సక్రమంగా వేతనం అందకపోవడానికి చింతిస్తున్నామని, వెంటనే వారిని ఆప్కోస్లోకి తీసుకుంటే నెలనెలా వేతనాలు సక్రమంగా అందుతాయని 2023, ఫిబ్రవరి 24న ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నాలుగు నెలలవుతున్నా అదిగో ఇదిగో అంటున్నారే గానీ.. అమలు చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకే విలువ లేకపోవడం ఏమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి వద్దే ఆగిన దస్త్రం
ఉద్యోగ నియామకాలకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే సాంఘిక సంక్షేమ అధికారులు సిద్ధం చేశారు. సంబంధిత దస్త్రం కలెక్టరు ఆమోదించి అనంతరం ఇన్ఛార్జి మంత్రికి పంపినట్లు సమాచారం. ఇన్ఛార్జి మంత్రి నుంచి ఆమోదం పొంది రావాల్సి ఉండగా ఇంకా రాలేదు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు. ఈ ఆఫీసులో పరిశీలించి దస్త్రం ఆమోదించాల్సి ఉంది.
సంవత్సరాలుగా అందని వేతనం
జీతం లేకున్నా ఎప్పుడైనా వస్తుందంటూ సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 28 నెలలుగా పని చేసినట్లు అధికారులు లెక్కలు తీశారు. గతంలో ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేసేవారు. మొత్తం రూ.1.20 కోట్ల వేతనం అందివ్వాల్సి ఉంది. ఆప్కాస్ట్లోకి చేర్చుకుంటున్నట్లు నాలుగునెలల కిందట ఉత్తర్వులు రావడంతో ఆనందించారు. ఇప్పటి దాకా వేతనం ఇవ్వకపోగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఎవరికి చెప్పాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
వెంటనే నియమించాలి..
కళాశాల వసతి గృహాల్లో 41 మందికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలి. జీతాలకు వచ్చిన బడ్జెట్ కూడా వెనక్కి వెళ్లింది. వెంటనే ఆప్కోస్లోకి కలిపి వేతనాలు ఇవ్వాలి.
ఎమ్.తిప్పయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
త్వరలోనే నియామకాలు
41 మందిని ఎంపిక చేశాం. వారందరి వివరాలు క్రోడీకరించాం. సంబంధిత దస్త్రం కలెక్టరుకు నివేదించాం. త్వరలోనే వారికి నియామకపు ఉత్తర్వులు ఇస్తాం. గతంలో ఇవ్వాల్సిన వేతనానికి సంబంధించి వివరాలు సిద్ధం చేశాం.
విశ్వమోహన్రెడ్డి, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్