జోరుగా బేరాలు.. స్థలాల అమ్మకాలు!
ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన ఆరు వేల మందికి ఒకటిన్నర సెంటు ప్రకారం పట్టణ సమీపాన ఉన్న పోతులనాగేపల్లి వద్ద స్థలాలు ఇచ్చారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి.
రూ.30 కోట్ల విలువైనవి చేతులు మారిన తీరు
పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో పరిస్థితి
ప్రధాన రహదారి పక్కన జగనన్న కాలనీ
న్యూస్టుడే, ధర్మవరం: ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన ఆరు వేల మందికి ఒకటిన్నర సెంటు ప్రకారం పట్టణ సమీపాన ఉన్న పోతులనాగేపల్లి వద్ద స్థలాలు ఇచ్చారు. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి. ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రధాన రహదారికి సమీపాన ఒకటిన్నర సెంటు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు అమ్ముతున్నారు. కాస్త లోపలికి వెళితే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు చెబుతున్నారు. స్థలం పొందినవారు కొనుగోలుదారుకు అగ్రిమెంట్లు రాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటి బిల్లులు దక్కేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులదే కీలకపాత్ర. దళారుల ద్వారా కమీషన్ తీసుకుంటూ క్రయవిక్రయాలు చేస్తున్నారు. స్థలం అమ్మించినందుకు రూ.50 వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు. పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో 6089 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వీరందరూ ధర్మవరం పట్టణానికి చెందినవారే. 4500 మంది నిర్మాణాలు చేపట్టారు. మరో 1500 మంది ఇంతవరకు ప్రారంభించలేదు.
వెయ్యికిపైగా విక్రయం
కాలనీలో ఏడాదిగా జోరుగా బేరాలు...క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఇళ్ల పట్టాల క్రయవిక్రయాలకు అవకాశం లేదు.రిజిస్ట్రేషన్ కావు. కొందరు వైకాపా నాయకులు మధ్యవర్తులను పెట్టుకుని ఒప్పంద విధానంలో క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికే 1000 పట్టాల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. సుమారు రూ.30 కోట్ల మేర చేతులు మారాయి. ఇంత జరుగుతున్నా విక్రయాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించడం లేదంటూ అధికార యంత్రాంగం మిన్నకుండిపోతోంది. అధికార పార్టీ అండతోనే దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రద్దు చేస్తాం...
ఇళ్ల స్థలాలను అమ్ముకుంటే పట్టా రద్దు చేస్తాం. లబ్ధిదారుల నుంచి ఎవరూ కొనవద్దు. విచారణ తేలితే కొనుగోలుదారులు నష్టపోతారు. దళారులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
తిప్పేనాయక్, ఆర్డీవో, ధర్మవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు