తిండి పెట్టకున్నా.. బిల్లు పెట్టారు!
భిక్షాటకులకు, అనాథలకు తిండి పెట్టలేదు కానీ నాయకులు, అధికారులు మాత్రం బిల్లుపెట్టారు. పట్టెడు మెతుకులను ఏనాడూ పెట్టకుండా ఏడు నెలల్లో తాము గుత్తిలోని పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో రోజూ 70 మంది వృద్ధులు, అనాథలకు భోజనం పెట్టామని బుకాయిస్తున్నారు.
గుత్తిలోని నిరాశ్రయుల కేంద్రం
గుత్తి, న్యూస్టుడే: భిక్షాటకులకు, అనాథలకు తిండి పెట్టలేదు కానీ నాయకులు, అధికారులు మాత్రం బిల్లుపెట్టారు. పట్టెడు మెతుకులను ఏనాడూ పెట్టకుండా ఏడు నెలల్లో తాము గుత్తిలోని పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో రోజూ 70 మంది వృద్ధులు, అనాథలకు భోజనం పెట్టామని బుకాయిస్తున్నారు. అనాథల భోజనం పేరుతో నిధులను బొక్కేందుకు పావులు కదుపుతున్నారు. రోజూ 70 మంది వసతిగృహంలో ఉంటున్నట్లు, ఒక్కో భోజనం రూ.45 చొప్పున పెట్టినట్లు తప్పుడు లెక్కలు రాశారు. వసతిగృహం నిర్వాహకులు చౌకబియ్యంతో అన్నం వండించి పెడుతున్నారు. రోజూ పదిమంది మాత్రమే భోజనం చేస్తున్నారు. దాతలు కూడా అనాథలకు సాయం చేస్తుంటారు. రాత్రి సమయాల్లో హోటళ్లలో మిగిలిపోయిన అన్నాన్ని తెచ్చిపెడుతుంటారు. నాయకులు మాత్రం హోటళ్ల నుంచి భోజనాలు కొనుగోలు చేసి పెడుతున్నట్లు లెక్కలు రాయించారు. ఏడు నెలల్లో రూ.14 లక్షలు వెచ్చించి భోజనాలు అనాథలకు పెట్టినట్లు రికార్డులు సృష్టించారు. అనాథలకు ఆహారం పేరుతో బిల్లులు దండుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు కుమ్మక్కై పథకం ప్రకారం బోగస్ బిల్లు పెట్టారు. ఇది తెలుసుకున్న కౌన్సిలర్లు అడ్డుకున్నారు. రెండు నెలల కింద నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు బోగస్ బిల్లును వ్యతిరేకించారు. అజెండాలో చేర్చిన ఈ అంశాన్ని ఆమోదించకుండా అడ్డుకున్నారు. అయినా అనాథల భోజనం బిల్లును ఆమోదించినట్లు మినిట్స్ పుస్తకంలో రాశారు. ఇది తెలుసుకున్న కౌన్సిలర్లు, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి గతనెల 31న నిర్వహించిన సమావేశంలో సమస్యను లేవనెత్తారు. బిల్లు చెల్లింపును తాము వ్యతిరేకించినా ఆమోదం తెలిపినట్లు ఎలా రాసుకుంటారని ధ్వజమెత్తారు. అన్న చెప్పినందుకు అలాచేశామని ఓ ప్రజాప్రతినిధి సమాధానం గమనార్హం. కౌన్సిల్లో బిల్లును ఆమోదించలేదని మినిట్్్సలో రాయించారు. ఈ బిల్లు విషయమై కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాను రాకముందు జరిగిన వాటికి బాధ్యుడిని కాదన్నారు. తాను వచ్చిన తరువాత ఏదైనా జరిగితే బాధ్యత తీసుకుంటానని కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
[ 28-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. -
జలకళ ఏదీ జగన్?
[ 28-03-2024]
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. -
ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్
[ 28-03-2024]
-
పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన
[ 28-03-2024]
అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఐదేళ్లయినా అధికారులిక్కడే..
[ 28-03-2024]
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. -
మంచినీరు వృథా.. వ్యధ..
[ 28-03-2024]
ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. -
భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?
[ 28-03-2024]
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. -
తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?
[ 28-03-2024]
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు. -
అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ
[ 28-03-2024]
అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్లతో సినిమా తీశారు. -
30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు
[ 28-03-2024]
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు. -
సి-విజిల్ ఫిర్యాదులు పరిష్కరించండి
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. -
ఖాద్రీశుడి సమ్మోహనం
[ 28-03-2024]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు. -
రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు
[ 28-03-2024]
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
[ 28-03-2024]
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. -
పది పరీక్షలకు 2,203 మంది గైర్హాజరు
[ 28-03-2024]
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిసాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!