logo

‘భవిషత్తు గ్యారెంటీ’పై విస్తృత ప్రచారం

‘భవిషత్తు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి అన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.

Published : 03 Jun 2023 03:14 IST

అచ్చెన్నాయుడుతో జిల్లా తెదేపా నాయకులు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘భవిషత్తు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి అన్ని నియోజకవర్గాల్లో మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల పరిశీలకులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. భవిషత్తు గ్యారెంటీ కార్యక్రమం విస్తృత ప్రచారంపై పరిశీలకులు వారి నియోజకవర్గాల్లో వారానికి మూడ్రోజులపాటు క్రమం తప్పకుండా తిరగాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, బుగ్గయ్యచౌదరి, జేఎన్‌ మురళి, దేవళ్ల మురళి, రామ్మోహన్‌చౌదరి తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని