రహదారికి కొత్తరూపు.. రాకపోకలకు సుగమం
ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన 342వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అటు కడప, ఇటు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు ఎన్హెచ్ 342 రహదారి కీలకంగా మారనుంది.
శరవేగంగా ఎన్హెచ్ 342 విస్తరణ పనులు
న్యూస్టుడే, ముదిగుబ్బ
ముదిగుబ్బ-పుట్టపర్తి మార్గంలో రూపుదిద్దుకున్న జాతీయ రహదారి
ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన 342వ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే అటు కడప, ఇటు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు ఎన్హెచ్ 342 రహదారి కీలకంగా మారనుంది. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి, గోరంట్ల మీదుగా చిలమత్తూరు మండలంలోని కోడూరు వరకు మొత్తం 80 కిలోమీటర్లు రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో భాగంగా ముదిగుబ్బ - పుట్టపర్తి వరకు 32 కిలోమీటర్లు రెండు వరుసల రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. మూడు నెలల కిందట సర్వేలు చేపట్టి భూములు కోల్పోయే వారితో గ్రామసభలు నిర్వహించారు. విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటికే కల్వర్టుల నిర్మాణం, బేస్లెవల్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల మేరా తారురోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు.
ఎంతో ఉపయోగం..
పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే ముదిగుబ్బ మీదుగా ప్రయాణించడం దగ్గర మార్గం. ఇది వరకు ఉన్న రోడ్డు సక్రమంగా లేకపోవడంతో కదిరి మీదుగా ప్రయాణించేవారు. 7 మీటర్లుగా ఉన్న రహదారిని 10 మీటర్లుగా వెడల్పు చేస్తుండటంతో నిర్మాణం పూర్తయితే బెంగళూరు వెళ్లేందుకు కదిరి మీదుగా అవసరం లేకుండా ముదిగుబ్బ మీదుగా ప్రయాణం సాఫీగా సాగనుంది. ఎన్హెచ్ 342 రోడ్డు నుంచి ఎన్హెచ్ 44 బెంగళూరు హైవేకి రోడ్డు కలపడంతో రాకపోకల కష్టాలు తీరి, దూరం తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా కానుంది. ముదిగుబ్బ మండలంలో ఎన్హెచ్ 42తోపాటు, ఎన్హెచ్ 342, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో ఏర్పాటు కానుండటంతో జాతీయ రహదారులతో మరింత అభివృద్ధి చెందనుంది.
త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు
జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాకపోకలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల మేరకే పనులు చేపట్టాలని గుత్తేదారులకు సూచించాం. త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
రాఘవేంద్రరావ్, జేఈ, ఎన్హెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు