అర్హులైన రైతులందరికీ సంక్షేమ ఫలాలు
జిల్లాలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా నూతన వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి ఆమె జిల్లాకు వచ్చారు.
నూతన డీఏవో ఉమామహేశ్వరమ్మకు పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రనాయక్
జిల్లా వ్యవసాయం, న్యూస్టుడే: జిల్లాలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా నూతన వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి ఆమె జిల్లాకు వచ్చారు. శనివారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో డీఏవో చంద్రనాయక్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. అనంతరం బాధ్యతలు అప్పగించారు. దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాకు కొత్తే.. అయినా పక్కనున్న కర్నూలు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశా. జిల్లాపై కొంత పట్టుంది. అధికారులు, సిబ్బందితో కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాయుశక్తులా కృషి చేస్తామని వివరించారు. అనంతరం డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, కార్యాలయ సిబ్బంది నూతన డీఏవోకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
సైకిల్ తొక్కడంతో ఆరోగ్యం
ఎస్కేయూ ఆవరణలో సైకిల్ తొక్కుతున్న రెక్టార్ మల్లికార్జునరెడ్డి, తదితరులు
ఎస్కేయూ: సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఎస్కేయూ రెక్టార్ ఆచార్య మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ బైస్కిల్ దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్, ఎన్వైకే ఆధ్వర్యంలో సైకిల్డే ర్యాలీ శనివారం నిర్వహించారు. నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్, ఎన్ఎస్ఎస్ అధికారి రామిరెడ్డి, యువకేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ వీర బాదుడు
[ 27-03-2024]
తాను అధికారంలోకి వస్తే అన్ని పెంచుకుంటూ పోతానని ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అన్నారు. బస్సు, కరెంటు ఛార్జీలను ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు. -
ఎట్టకేలకు భూగర్భ రైలు వంతెన పూర్తి
[ 27-03-2024]
నగరవాసులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న గడియారం స్తంభం కూడలిలోని ప్రధాన వంతెన కింద ఏర్పాటు చేసిన భూగర్భ రైలు వంతెన పనులు ఎట్టకేలకు పూర్తి చేశారు. -
15 మంది వాలంటీర్లు.. ముగ్గురు మున్సిపల్ సిబ్బంది తొలగింపు
[ 27-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘించే ప్రభుత్వ సిబ్బందిపై కలెక్టర్ గౌతమి చర్యలు చేపట్టారు. ఆర్ఓలతో నివేదికలు తెప్పించుకుని వేటు వేస్తున్నారు. -
అంగన్వాడీ పోషణ అంతంతే!
[ 27-03-2024]
-
అతిథుల హాహాకారాలు
[ 27-03-2024]
సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి చిలమత్తూరు మండలం వీరాపురం వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం గగనంగా మారింది. -
గర్భిణి మృతి అనుమానాస్పదం?
[ 27-03-2024]
అనంత కలెక్టర్ కార్యాలయ సర్కిల్లో ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద చోటు చేసుకున్న గర్భిణి అంజలి (29) మృతి అనుమానాస్పదంగా మారింది. -
నేతల తలరాత మార్చే..
[ 27-03-2024]
పుట్టపర్తి నియోజకవర్గంలోని మెప్మా సంఘాల ఆర్పీలు, యానిమేటర్లతో వైకాపా నాయకుడు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పథకాల గురించి కనీసం 20 ఓట్లు వేయించేలా చూడాలని నిర్దేశం చేశారు. -
కుంటపై కన్నేశారు.. పూడ్చేందుకు రాళ్లేశారు!
[ 27-03-2024]
కరవు ప్రాంతానికి ప్రతీకగా నిలిచే జిల్లాలో ప్రతి నీటి బొట్టూ వృథా కాకుండా భూమిలో ఇంకింపజేయాలి. జలవనరులను సంరక్షించుకోవాలన్న నినాదాలతో అప్పట్లో ఇంకుడు గుంతలు, కుంటలు ఏర్పాటు చేశారు. వాటిని కాపాడాల్సిన నాయకులే నేడు వాటిపై కన్నేశారు.
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన