దస్త్రాలు మార్చారు.. భూమి కాజేశారు
గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న రైతుకు చెందిన రూ.50 లక్షలకు పైగా విలువచేసే 3.5 ఎకరాల పొలాన్ని అదే పేరున్న మరొక వ్యక్తి అమ్మేసిన ఘటన ఇది.
పంట నవీకరణకు ఒన్బీ తీస్తే వెలుగుచూసిన వైనం
పట్టాదారు పాసుపుస్తకం, దస్త్రాలు చూపుతున్న రైతు వెంకటాద్రి
గోరంట్ల, న్యూస్టుడే: గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్న రైతుకు చెందిన రూ.50 లక్షలకు పైగా విలువచేసే 3.5 ఎకరాల పొలాన్ని అదే పేరున్న మరొక వ్యక్తి అమ్మేసిన ఘటన ఇది. అసలైన రైతుకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెప్పే రెవెన్యూశాఖ ఎలాంటి పరిశీలన, విచారణ లేకుండా సదరు పొలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద ఒన్బీలోకి ఎక్కించేయడం గమనార్హం.
60 ఏళ్లకుపైగా సాగులో.. గోరంట్ల మండలం వానవోలుకు చెందిన ఎస్.వెంకట్రామప్ప, లచ్చుమక్క దంపతుల కుటుంబానికి 60 ఏళ్లకు పైగా గౌనివారిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం:32లో అరెకరా, సర్వే నం: 33లో మూడెకరాలు కలిపి మొత్తం 3.5 ఎకరాల పొలం ఉంది. పక్కా పట్టాభూమి అయిన పొలాన్ని 1958లో లచ్చుమక్కకు పుట్టింటివారు కుంకుమ పసుపు పేరున చిలమత్తూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించి ఇచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండడంతో అందరూ కలిసి 06.05.1991న కుమారుడు వెంకటాద్రి పేరున దానవిక్రయం చేశారు. అప్పటి నుంచి ఆయనే సాగుచేసుకుంటున్నారు. సమీప గ్రామానికి చెందిన వెంకటాద్రి (తండ్రి వెంకట్రామప్ప) పేరున్న వ్యక్తి 2012లో తన భూమిగా పేర్కొంటూ ఓ కంపెనీకి అమ్మేశాడు. ఈ విషయం రైతులకు వారం క్రితం వరకు తెలియదు. 2022లో కూడా ఒన్బీ తనపేరు మీద రావడంతో పంట రుణాన్ని నవీకరణ చేసుకున్నాడు. ఈ నెలలో నవీకరణ చేసుకోవడానికి వెళ్లగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ పొలానికి ఆనుకుని బెంగళూరు - అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది. ప్రభుత్వమే ఎకరాకు రూ.15 లక్షలు ఇస్తోంది.
* గోరంట్ల మండలంలో 2012లో నకిలీ పట్టాదారు పుస్తకాలతో కొంతమంది స్థానికులు గౌనివారిపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన వందల ఎకరాల భూములను పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ కంపెనీకి విక్రయించారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో వరుస కథనాలు వచ్చాయి. అప్పట్లో సంచలనం కావడం, పోలీసులు కేసు నమోదు చేశారు. పరిశీలించిన ఉన్నతాధికారులు కంపెనీ పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేయడంతో కొంతకాలం ఆపేశారు. విషయం మరుగున పడడంతో 2021 నుంచి కంపెనీ కొనుగోలు చేసిన పొలాలకు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే రీతిలో 14.05.2023న వెంకటాద్రికి చెందిన పొలాలకు కంపెనీపేరు మీద ఒన్బీలోకి ఎక్కించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలంటే అమ్మిన వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వాలి, క్షేత్రపరిశీలన జరగాలి, లింకు డాక్యుమెంట్లు జతచేయాలి.. అప్పుడే సాధ్యమౌతుంది. ఈతంతు ఏదీ జరగలేదని రైతు అంటున్నారు.
వినతి ఇవ్వాలి : రైతుకు తెలియకుండా పొలం విక్రయం జరిగిపోయిన విషయంపై కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడంతో పాటు కోర్టుకు వెళ్లాలి.
-రంగనాయకులు, తహసీల్దార్, గోరంట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్