డీటీసీ సేవలు అభినందనీయం
అనంతపురం జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) శివరామప్రసాద్ సేవలు అభినందనీయమని పలువురు అధికారులు పేర్కొన్నారు.
శివరామప్రసాద్ను సన్మానిస్తున్న శ్రీసత్యసాయి డీటీవో కరుణసాగర్రెడ్డి, అనంతపురం ఆర్టీవో సురేష్నాయుడు
లక్ష్మీనగర్(అనంతపురం), న్యూస్టుడే: అనంతపురం జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) శివరామప్రసాద్ సేవలు అభినందనీయమని పలువురు అధికారులు పేర్కొన్నారు. శివరామప్రసాద్ శ్రీకాకుళం డీటీసీగా బదిలీ అయిన సందర్భంగా శనివారం అనంతపురంలోని రవాణాశాఖ కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. డీటీసీని శ్రీసత్యసాయి జిల్లా డీటీవో కరుణసాగర్రెడ్డి, ఆర్టీవో సురేష్నాయుడు సన్మానించారు. మూడున్నరేళ్లపాటు జిల్లాలో సమర్థంగా పనిచేశారని గుర్తుచేశారు. అనంతరం శివరామప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రస్థానంలో తనకు సహరించినవారందరీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, రమణారెడ్డి, సునీత, అతికానాజ్, ఏఎంవీఐలు శ్రీనివాసులు, రఘునాథ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
*అనకాపల్లి ఆర్టీవోగా పనిచేసున్న వీర్రాజుకు డీటీసీగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఈయన విధుల్లోకి చేరేంత వరకు అనంతపురంలో ఆర్టీవోగా పనిచేస్తున్న సురేష్నాయుడుకు ఇన్ఛార్జి డీటీసీగా బాధ్యతలు అప్పగించారు.
నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి
ప్రాసిక్యూషన్ గదులు పరిశీలిస్తున్న డైరెక్టర్ సుదర్శన్రెడ్డి
అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్టుడే: క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేయాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా కోర్టులోని ప్రాసిక్యూషన్ భవనంలో పీపీలు, ఏపీపీలతో వివిధ కేసులపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయి, వాటి వివరాలను తెలుసుకున్నారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులు వీగి పోకుండా గట్టిగా కృషి చేయాలన్నారు. సుదర్శన్రెడ్డిని బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ రామనాయక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథరెడ్డి, ప్రత్యేక పీపీలు ఉమాపతి, విద్యాపతి, సృజన, లక్ష్మీనారాయణరెడ్డి, నాగరాజరావు, నారపరెడ్డి, ఏపీపీలు దుర్గాదేవి, సుచిత్ర, హేమలత, శ్రీనివాసులు, వసంత లక్ష్మి, నగేశ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే