బురిడీ కొట్టించారు..!
శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామానికి చెందిన రంగమ్మకు తల్లిదండ్రులు నుంచి 1955లో 8 ఎకరాల పొలం వచ్చింది.
భూకబ్జాపై మహిళా కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు..
విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
బాధితురాలిని కలవకుండానే నివేదిక పంపిన జిల్లా పోలీసులు
సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణ
రంగమ్మ
జరిగిందిదీ..
శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామానికి చెందిన రంగమ్మకు తల్లిదండ్రులు నుంచి 1955లో 8 ఎకరాల పొలం వచ్చింది. సర్వే నంబరు 30-1లో 8 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగ్గా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 7.47 ఎకరాలు మాత్రమే నమోదు చేశారు. మిగిలిన 53 సెంట్లు ఎక్కించక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయాలని 2021 నుంచి పలుసార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెండేళ్ల కిందట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆ 53 సెంట్లతోపాటు అర ఎకరాన్ని ఆక్రమించి దౌర్జన్యంగా ముళ్లకంప వేశారు. దీంతో భర్త శ్రీరాములు రెవెన్యూ, పోలీసులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వారి తోటలో ఉన్న 50 మామిడిచెట్లను దౌర్జన్యంగా తొలగించి, విద్యుత్తు సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేశారు. నీరు లేక మిగిలిన చెట్లు కూడా ఎండిపోయాయి. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైన శ్రీరాములు గత నెలలో అనారోగ్యానికి గురై చనిపోయారు. కేవలం అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే తన భర్త మృతి చెందాడని, పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రంగమ్మ రాష్ట్ర మహిళ కమిషన్కు మే నెలలో ఫిర్యాదు చేశారు.
ఈనాడు డిజిటల్, అనంతపురం: జిల్లా పోలీసులు మహిళ కమిషన్నే బురిడీ కొట్టించారు. భూ కబ్జాపై ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి విచారించకుండానే ఫిర్యాదుదారురాలి ఊరికి వెళ్లి ఇరు వర్గాలను విచారణ చేసినట్లు నివేదిక పంపారు. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రాసుకున్నట్లు నివేదికలో తెలియజేశారు. అయితే మహిళ కమిషన్కు పంపిన నివేదికలో పేర్కొన్నట్లు ఏ పోలీసు అధికారి తమను విచారించలేదని.. స్టేట్మెంట్లో ఉన్న సంతకం తనది కాదని, ఫోర్జరీ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. పోలీసులు పంపించిన నివేదికను బాధితురాలికి తిరిగి పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తప్పుడు సమాచారంతో నివేదిక
ముదిగుబ్బ పోలీస్స్టేషన్
రంగమ్మ ఫిర్యాదును పరిశీలించి తగు విచారణ జరిపి నివేదిక పంపాలని జిల్లా పోలీసులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ముదిగుబ్బ పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వెళ్లినట్లు ఓ నివేదిక రూపొందించారు. ఫిర్యాదుదారు రంగమ్మనే అవతలి వారి పొలాన్ని ఆక్రమించినట్లు, పోలీసులు సమక్షంలోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే హైకోర్టులో డబ్ల్యూపీ నం. 3021/2022 కేసు నడుస్తోందని నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు అవతలి వారిపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని రంగమ్మ అంగీకరించి స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆమె సంతకంతో ఓ కాగితాన్ని తయారు చేశారు. పోలీసులు మహిళా కమిషన్కు ఇచ్చిన నివేదికలో ఒక్కటి కూడా నిజం లేదని రంగమ్మ ఆరోపిస్తున్నారు. పోలీసులు నివేదికలో పేర్కొన్న రిట్ పిటిషన్ నంబరుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. రిట్ పిటిషన్ నంబరు 1321/22లో కేసు హైకోర్టులో ఉందని పేర్కొంటున్నారు. వైకాపా నాయకులతో పోలీసులు కుమ్మక్కై తప్పుడు రిట్ పిటిషన్ నంబరు వేసి నివేదిక పంపించారని, తన పేరుతో తయారు చేసిన స్టేట్మెంట్లోని సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అసలు పోలీసులు తన వద్దకు వచ్చిందే లేదని చెబుతున్నారు. నివేదికను జిల్లా ఎస్పీ కూడా కనీసం పరిశీలించకుండానే మహిళా కమిషన్ను పంపించారని ఆమె వాపోతున్నారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తానని, తన సంతకాన్ని ఫోరెన్సిక్కు పంపించి నిజాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామానికి వెళ్లి విచారించాం
మంగళమడకకు చెందిన రంగమ్మ ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని మహిళా కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మా సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారించారు. రంగమ్మ విచారణకు రాకుండానే ఆరోపణలు చేస్తున్నారు. పలుమార్లు స్టేషన్కు పిలిచినా రాలేదు. మహిళా కమిషన్కు పంపిన స్టేట్మెంట్లోని సంతకం రంగమ్మదే. తప్పుడు సంతకంతో రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. అయితే మహిళా కమిషన్కు పంపిన నివేదికలో పొరపాటున డబ్ల్యూపీ నంబరు తప్పుగా ప్రచురితమైంది.
- కంబగిరి రాముడు, సీఐ, ముదిగుబ్బ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?