సరఫరా.. అరకొర
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజు గడుస్తోంది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అరకొరగా విత్తన పంపిణీ కొనసాగుతుంది. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు చేరలేదు.
ఆర్బీకేలకు చేరని ఎరువులు
కొన్ని కేంద్రాలకే వేరుసెనగ పంపిణీ
చేలలో పశువుల ఎరువు కుప్పలు
న్యూస్టుడే, జిల్లా వ్యవసాయం, పుట్టపర్తి;- ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజు గడుస్తోంది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అరకొరగా విత్తన పంపిణీ కొనసాగుతుంది. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు చేరలేదు. ఒకవైపు బ్యాంకుల్లో పంట రుణాల నవీకరణ జరుగుతుంది. వడ్డీలు కట్టలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు సేద్యం, విత్తన పెట్టుబడులు ఖర్చులు పెరగడంతో వీటి పనులు పుంజుకోలేదు. వ్యవసాయశాఖ సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 10,18,582 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేరుసెనగ విత్తనం ఒక్కటే పంపిణీ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. జిల్లా వ్యవసాయాధికారితోపాటు ఇతర అధికారులను బదిలీ చేసింది. పంపిణీ, నాణ్యత చూసేవారు కరవయ్యారు.
6.35 లక్షల ఎకరాల్లో వేరుసెనగ
జిల్లాలో 6,35,022 ఎకరాల్లో వేరుసెనగ సాగు కానుంది. పత్తి 1,41,932 ఎకరాలు, కంది 83,135, వరి 47,962, మొక్కజొన్న 23,182, జొన్న 19,365, ఉలవలు 12,457, ఆముదం 34,275 , పొద్దు తిరుగుడు 5,440, చిరుధాన్యాలు 4,527, పెసర 4,392, సజ్జ 3,712, సోయాబీన్ 1,365 ఎకరాల్లో పంటలు సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
*జిల్లాకు అన్ని రకాల విత్తనాలు కలిపి 85,322 క్వింటాళ్లు కేటాయింపులు జరిగాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఒక్క వేరుసెనగ విత్తనం పంపిణీ మాత్రమే సాగుతోంది. మిగిలిన విత్తనాలు రైతుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అత్యధికంగా వేరుసెనగ విత్తనాలు 78,245 క్వింటాళ్లు, కంది 4,300, ఉలవలు 825, వరి 1500, పెసలు 156, ఉద్దులు 42, పచ్చిరొట్ట ఎరువులు 202, కొర్ర 50, రాగులు కేవలం 3 క్వింటాళ్లు కేటాయించారు. వేరుసెనగ విత్తనం కావాలని ఆర్బీకేల్లో ఇప్పటికే 58,380 మంది రైతులు 50,834 క్వింటాళ్లు కావాలని పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 13,402 మంది రైతులకు 12,161 క్వింటాళ్లు మాత్రమే వేరుసెనగ పంపిణీ చేశారు. ఇతర విత్తనాల పంపిణీ ఊసేలేదు.
నాణ్యతలో సందేహాలు : జిల్లాలో 8 వేరుసెనగ ప్రాసెసింగ్ యూనిట్లలో విత్తనశుద్ధి సాగుతోంది. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాలకు ఇండెంట్ ప్రకారం లారీలు పంపుతున్నారు. 730 క్వింటాళ్లు విత్తనం నాసిరకంగా ఉండటంతో లారీలు వెనక్కి పంపడం జరిగిందని వ్యవసాయాధికారులు తెలిపారు.
ఎరువులు
ఎరువులు నెలవారీగా ప్రణాళికలు వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. జూన్ నెలకు సంబంధించి అన్ని రకాల ఎరువులు కలిపి మొత్తం 12,763 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అందులో యూరియా 4,379, డీఏపీ 1,279, కాంప్లెక్స్ ఎరువులు 3,915, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ 960, సింగల్ సూఫర్ పాస్పేట్ 2,204 మెట్రిక్ టన్నులు ఎరువులు కేటాయించారు. ఆర్బీకేలకు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే చాలా ఆర్బీకేలకు ఎరువులు చేరలేదు.
*150 ఆర్బీకేలకు 2,810 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు నిల్వ ఉందని, మరో 259 ఆర్బీకేల్లో 377 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచామని ఏపీ మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ఇంకా 42 ఆర్బీకేలకు ఎరువులు చేరలేదని వ్యవసాయశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఇన్ఛార్జులు కావాల్సిన ఎరువులు ఆన్లైన్లో ఇండెంట్ పంపితేనే ఆర్బీకేలకు ఏపీ మార్క్ఫెడ్ ఎరువులు సరఫరా చేస్తుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.
15 తర్వాత విత్తుకోవచ్చు
నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఇప్పటికే రైతులు విత్తుకు సిద్ధం చేసుకున్నారు. వానలు వస్తే విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 15 తర్వాత వేరుసెనగ, ఇతర పంటలు విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. జూలై నెలాఖరు వరకు విత్తు వేసుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మల్లీశ్వరీ సూచిస్తున్నారు.
ఖరీఫ్కు సిద్ధం
రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. వేరుసెనగ విత్తనాలను ప్రతి ఆర్బీకే పరిధిలో మండల వ్యవసాయాధికారులు తనిఖీ చేస్తున్నారు. నాణ్యత లేకపోతే వెనక్కి పంపుతున్నాం. విత్తన నాణ్యతపై సందేహం లేదు. రైతులందరికీ మేలైన విత్తనం పంపిణీ చేస్తాం.
ఉమామహేశ్వరమ్మ-డీఏవో (అనంతపురం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!