వేసవి వెన్నెల.. బోధన భళా!
వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉరవకొండకు చెందిన నిస్వార్థ, హైదరాబాద్కు చెందిన అభయ స్వచ్ఛంద సంస్థలు ‘వేసవి వెన్నెల’ పేరుతో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి.
వివిధ ఉపకరణాలు తయారు చేస్తున్న విద్యార్థులు
ఉరవకొండ, న్యూస్టుడే: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉరవకొండకు చెందిన నిస్వార్థ, హైదరాబాద్కు చెందిన అభయ స్వచ్ఛంద సంస్థలు ‘వేసవి వెన్నెల’ పేరుతో ఉచిత శిక్షణ అందిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 60 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారికి ఉరవకొండలోని కరిబసవస్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల రోజుల కిందట శిక్షణను ప్రారంభించారు. ఇక్కడ విద్యార్థులకు యోగా, ఆధ్యాత్మికత, నైతిక విలువలకు సంబంధించిన అంశాలు బోధిస్తున్నారు. వాటితోపాటు ప్రార్థన, గీతా శ్లోకాలు, శతక పద్యాలు, దేశభక్తి గీతాలు, సత్యసాయి పద్య సూక్తులు, చిన్న కథలు, ఆధ్యాత్మిక భజనలు, ఆటలు, ఆరోగ్యం, ఆదర్శ సూత్రాలు, కోలాటం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 10 మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులు శిక్షణల్లో భాగస్వాములవుతున్నారు. ఈ తరగతులు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు వారికి కేటాయించిన వేళల్లో విశ్లేషణాత్మకంగా బోధిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. శిక్షణలో విద్యార్థులకు మధ్యాహ్నం రుచికర భోజనం.. ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలపై వివిధ ఉపకరణాలు తయారు చేసి చక్కటి ప్రతిభ చూపుతున్నారు.
చిన్నతనంలోనే మంచి నేర్పాలని..
యోగా సాధన చేస్తూ..
పిల్లలకు చిన్నతనంలోనే మంచిని నేర్పుతూ, వారు తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించేలా నేర్పాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించాం. నెల రోజులపాటు జరిగిన తరగతుల్లో వారికి ఎన్నో విషయాలు నేర్పాము. చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించాం. - సునీత, శిక్షణ సమన్వయకర్త
సాయం చేసే భావన అలవడింది
శిక్షణలో చాలా అంశాలు తెలుసుకున్నా. ఉపాధ్యాయులు యోగాతో పాటు మరిన్ని విషయాలు చక్కగా బోధించారు. నేను ఇతరులకు సాయం చేయాలన్న భావనను అలవర్చుకున్నా. సాయం చేయడంలో ఎంత ప్రాధాన్యం ఉందో శిక్షణకు వచ్చిన తరువాత తెలిసింది. దాన్ని భవిష్యత్తులో పాటిస్తాను. - హర్షిత, విద్యార్థిని
అందరూ సమానమే అని తెలిసింది
శిక్షణలో అందరూ సమానమే అని తెలుసుకున్నా. మాకు నేర్పిన ప్రార్థన, గీతా శ్లోకాల ద్వారా అనేక అర్థాలు తెలిశాయి. శతక పద్యాలు ఇట్టే చెప్పేస్తాం. వాటికి భావాలను ఉపాధ్యాయులు వివరించారు. - చందన, విద్యార్థిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..