‘నాసిన్’ పరిధిలో స్వయం ఉపాధికి అవకాశాలు
గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నిర్మాణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నాసిన్ కంపెనీ పరిధిలోని గ్రామాల ప్రజలకు స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్మల్హోత్ర పేర్కొన్నారు.
కలెక్టర్ అరుణ్బాబుకు సమస్యలు విన్నవిస్తున్న గ్రామస్థులు
గోరంట్ల, న్యూస్టుడే: గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నిర్మాణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నాసిన్ కంపెనీ పరిధిలోని గ్రామాల ప్రజలకు స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్మల్హోత్ర పేర్కొన్నారు. పాలసముద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల తయారీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత చలపతిరావు, నాసిన్ ప్రతినిధులు వివేక్జోరీ, అశోక్శుక్లా, అరోరా, జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాంతప్రజల జీవన విధానంలో మార్చులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొదటి విడతగా పైరెండు అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ముందుకొచ్చిన రైతులకు బెంగళూరు సమీపానికి తీసుకెళ్లి పెంపకంపై క్షేత్రస్థాయి పరిశీలన ఏర్పాటు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక్కడే తయారయ్యే ఉత్పత్తులు సంస్థ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న శ్మశానవాటిక, ఉన్నత పాఠశాల ప్రహరీ సమస్యలను సర్పంచి గంగప్ప, మాజీ సర్పంచి నరసింహులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దారు రంగనాయకులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవో రఘునాథగుప్తా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!