సరిహద్దులు దాటుతున్న సర్కారు బియ్యం
పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దందా
తూతూ మంత్రంగా తనిఖీలు
పావగడ నుంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్న పీడీఎస్ బియ్యం లారీతో అధికారులు
న్యూస్టుడే, పుట్టపర్తి, మడకశిర;-పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతోంది. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పేదల నుంచి చౌక బియ్యాన్ని స్థానిక చిరు వ్యాపారులు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ-పాస్ మిషన్లను తీసుకువచ్చినా అక్రమ దందా ఆగడం లేదు. కొన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లే లబ్ధిదారుల నుంచి బియ్యం తీసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బియ్యం తరలిస్తూ పదే పదే పట్టుబడితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని అధికారులు చెబుతున్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో వ్యాపారులు భయంలేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు.
పావగడ కేంద్రంగా..
ఉమ్మడి జిల్లాలోని రొద్దం, మడకశిర, గుడిబండ, అమరాపురం, పెనుకొండ, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, రామగిరి తదితర మండలాలు కర్ణాటక రాష్ట్రం పావగడ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్నాయి. పావగడ పట్టణం కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా బాగోతం కొన్నేళ్లుగా సాగుతోంది. కార్డుదారుల నుంచి రూ.10-రూ.13లకు కొనుగోలు చేసి పావగడలోని రైస్మిల్లుకు తరలించి రీసైక్లింగ్ చేసి లారీల్లో మడకశిర మీదుగా తుమకూరు, శిరా, బెంగళూరు పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అక్రమరవాణా విషయంలో చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
రాజకీయ నేతల అండదండలతో..
అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వారు కేసులకు ఏ మాత్రం భయపడటం లేదు. అరెస్టు చేసిన నిందితులపై 6ఏ కేసులు నమోదు చేసి పంపుతున్నా.. దందా ఆపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారికి పలువురు అధికార పార్టీ నాయకులు, పోలీసు అధికారుల అండదండలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో బియ్యం లారీలను మడకశిర నుంచి సరిహద్దు దాటించడానికి నాయకులు, అధికారులే సహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుకున్న అక్రమ బియ్యం లారీలు, నిందితులు పావగడకు చెందిన వారే కావడం గమనార్హం.
కొన్ని ఉదాహరణలు..
*2022 మే 9న పావగడ నుంచి తుమకూరుకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 260 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దర్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
*2022 డిసెంబరు 14న మడకశిర సమీపంలోని రాజీవ్గాంధీ కూడలిలో కర్ణాటక రాష్ట్రం మధుగిరికి తరలివెళ్తున్న 180 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లారీని పట్టుకుని ఇద్దర్ని అరెస్టు చేశారు.
*ఈ ఏడాది ఫిబ్రవరి 6న పావగడ నుంచి రాత్రి వేళలో లారీలో అక్రమంగా వెళ్తున్న 165 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
*పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం రెడ్డిపల్లి రైస్బిల్లులో రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. నల్లమాడ, అమడగూరు పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమ బియ్యం తరలింపుపై ఆరు కేసులు నమోదు చేశారు. నల్లమాడ పోలీస్స్టేషన్లో ఒకే వ్యక్తిపై నాలుగు కేసులు నమోదు కావడం గమనార్హం.
ప్రత్యేక నిఘా ఉంచాం
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్ణాటక సరిహద్దులో బియ్యం, అక్రమ మద్యం రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు. పావగడలోని పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాం. మడకశిర కర్ణాటక సరిహద్దు కావడంతో పోలీసు, విజిలెన్స్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం.
వాసుదేవన్, డీఎస్పీ, పుటపర్తి, - సురేష్బాబు, సీఐ, మడకశిర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అçËకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు
[ 19-04-2024]
నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!