ఎట్టకేలకు వారియర్స్ జట్టు విజయం
అనంత క్రికెట్ లీగ్ పోటీల్లో వరుస ఓటములతో కుంగిపోయిన కోగటం వారియర్స్ జట్టుకు ఓ విజయం దక్కింది.
బహుమతి అందుకుంటున్న అర్జున్ తెందూల్కర్
అనంతపురం క్రీడలు, న్యూస్టుడే: అనంత క్రికెట్ లీగ్ పోటీల్లో వరుస ఓటములతో కుంగిపోయిన కోగటం వారియర్స్ జట్టుకు ఓ విజయం దక్కింది. బుధవారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన తొలి పోటీలో వారియర్స్ జట్టు శరవణ స్లగ్గర్స్ జట్టును 21 పరుగుల తేడాతో ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న శరవణ జట్టుకు కళ్లెం పడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన వారియర్స్ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులే చేసింది. బ్యాట్స్మెన్లు అంకిత్ (32), యోగానంద (31)లు పోరాటం చేయడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. అనంతరం స్వల్ప విజయ లక్ష్యంతో బరిలో దిగిన శరవణ జట్టు ప్రత్యర్థి బౌలింగ్ దెబ్బకు 18.2 ఓవర్లలో 122 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. వారియర్స్ బౌలర్లు వినయ్కుమార్, ప్రదీప్రెడ్డి, సంతోష్లు చెరో రెండు వికెట్లు కూల్చి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. రెండో పోటీలో అనంత రైజింగ్ స్టార్స్ జట్టు స్పార్టన్స్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్పార్టన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగా ప్రతిగా రైజింగ్ స్టార్ జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. బ్యాటర్లు అర్జున్ తెందూల్కర్ (66) అద్భుత బ్యాటింగ్తో అలరించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆర్డీటీ ఫుట్బాల్ అకాడమీ సమన్వయకర్త దాదా ఖలందర్ బి.సంతోష్కు, ఏఎస్ఏ అకాడమీల మేనేజరు వంశీకృష్ణ అర్జున్ తెందూల్కర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేశారు. ఈ పోటీలను ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధుసూదన్, డాక్టర్ సుప్రజాచౌదరిలు పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.