లారీ ఢీకొని వివాహిత దుర్మరణం
జాతీయ రహదారిపై బుక్కరాయసముద్రం మండల పరిధిలోని వడియంపేట గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైందని పోలీసులు చెప్పారు.
శిల్ప (పాత చిత్రం)
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: జాతీయ రహదారిపై బుక్కరాయసముద్రం మండల పరిధిలోని వడియంపేట గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైందని పోలీసులు చెప్పారు. శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన లక్ష్మీనారాయణకు ఆరు నెలల కిందట శిల్ప (21)తో వివాహమైంది. ఇతడు నగరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. భార్యను అనంతపురంలో కంప్యూటర్ శిక్షణలో చేర్పించాడు. బుధవారం ఉదయం గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇద్దరూ బయలుదేరారు. వడియంపేట గ్రామ శివారులో లారీ అకస్మాత్తుగా గ్రామంలోకి వెళ్లడానికి మలుపు తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనం లారీని బలంగా ఢీకొట్టింది. శిల్ప తల లారీ చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. లక్ష్మీనారాయణ గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెదేపా నాయకులు డేగల కృష్ణమూర్తి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య