logo

నిలిపిన ట్రాక్టర్‌ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి

రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలోని సుబ్బయ్యపాలెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

Published : 22 May 2022 05:32 IST

మృతుడు ఎన్టీఆర్‌ జిల్లా వాసి 


 రాజు (పాతచిత్రం) 

రొంపిచర్ల, న్యూస్‌టుడే: రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలోని సుబ్బయ్యపాలెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎస్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలేనికి చెందిన మేకల రాజు (25) వెల్డింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం వెల్డింగ్‌ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా దర్శి వెళ్లాడు. అక్కడ పనులు పూర్తి చేశాడు. తన సమీప బంధువు నాగార్జునసాగర్‌లో వెల్డింగ్‌ పనులు చేయాలని కోరటంతో శుక్రవారం రాత్రి దర్శి నుంచి నాగార్జునసాగర్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలోని సుబ్బయ్యపాలెం క్రాస్‌ రోడ్డు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారుల సమాచారంతో రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహం అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని