AP news: మంత్రి పేరు చెప్పి .. మాయ చేస్తూ !
పుంగనూరు పట్టణ శివార్లలో రోజురోజుకు అనధికారిక లేఔట్లు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది.. ఇటు ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ అక్రమాలను ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే..
●పుంగనూరులో పెరుగుతున్న అనధికార లేఔట్లు
●మిన్నకుండిపోతున్న అధికారులు
పురపాలిక పరిధిలో 15 గుర్తింపు
జిల్లావ్యాప్తంగా అక్రమ లేఔట్లపై కొన్నినెలల క్రితం అధికారులు వివరాలు సేకరించారు. గ్రామాల్లో 400, పట్టణాల్లో 399 అనధికారిక లేఔట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా పుంగనూరు పురపాలిక పరిధిలో 15 అనధికారికంగా లేఔట్లు ఉన్నాయని నిర్ధారించారు. వీటి విస్తీర్ణం 31.552 ఎకరాలని తేల్చారు. వాస్తవంగా పుంగనూరు మున్సిపాలిటీ, శివారుతో కలుపుకుంటే మొత్తం 200 ఎకరాలకు పైగానే అక్రమ లేఔట్లు ఉండే అవకాశం ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా వేస్తున్న లేఔట్లకు అడ్డుకట్ట వేయాలని మంత్రి పెద్దిరెడ్డి గతనెలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు జిల్లా, డివిజన్ స్థాయిలో విజిలెన్సు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అవసరమైన పక్షంలో అనధికారిక లేఔట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ తీసుకురావాలని యోచిస్తున్నట్టు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి.. చర్యలు చేపడితే పంచాయతీల ఆదాయం పెరగడంతోపాటు ప్రజలకు చట్టపరమైన ఇబ్బందులు తప్పుతాయి.
ప్రభుత్వ భూములనూ ఆక్రమిస్తూ..
పుంగనూరు మండలంలోని రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, కుమ్మరనత్తం గ్రామాల్లో ఎక్కువగా అనధికారిక లేఔట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రభుత్వ భూములు కూడా ఉన్నట్టు సమాచారం. కొందరు వాగు పోరంబోకు స్థలాలు, కుంటలను లేఔట్లలో కలిపేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఇలా అక్రమాలకు పాల్పడుతుండటంతోనే.. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించాలే తప్ఫా. ఇటువంటి కార్యకలాపాలకు దిగడమేంటని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే మీ దారి మీరు చూసుకోండి.. నా దారి నేను చేసుకుంటా అని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి అనధికారిక లేఔట్లను కట్టడి చేస్తే ప్రయోజనంగా ఉంటుంది.
నా దృష్టికి తీసుకురండి
పుంగనూరు మండల పరిధిలో ఎక్కడైనా అక్రమ లేఔట్లు ఉంటే.. ఎవరైనా నా దృష్టికి తీసుకురావచ్ఛు వాటిని పరిశీలించి.. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. స్థానిక పంచాయతీ అధికారుల బాధ్యత కూడా ఇందులో ఉంటుంది.- వెంకట్రాయులు, తహసీల్దారు, పుంగనూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?