Dollar Seshadri: వెంకన్న పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనది: స్వరూపానందేంద్రస్వామి

తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణం తనను కలచివేసిందని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు.

Published : 29 Nov 2021 09:30 IST

విశాఖ: తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణం తనను కలచివేసిందని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదని చెప్పారు. వెంకన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ డాలర్‌ శేషాద్రి సుపరిచితులన్నారు. ఆయన ఆప్యాయతను పొందినవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. డాలర్‌ శేషాద్రితో విశాఖ శారదా పీఠానికి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. ఆయన మహావిష్ణువు హృదయంలో చేరాలని ఆశిస్తున్నట్లు స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని