logo

దక్షిణాది అంతర వర్సిటీ పోటీలకు ఎస్వీయూ

దక్షిణాది అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్‌ పోటీలకు శ్రీవేంకటేశ్వర వర్సిటీ పురుషుల జట్టు ఎంపికైందని.. వర్సిటీ వ్యాయామ విద్యావిభాగం విభాగాధిపతి ఆచార్య ఎం.శివశంకర్‌ రెడ్డి శనివారం ఒక ప్రటనలో తెలిపారు. ఈనెల 6 నుంచి గుంటూరు కె.ఎల్‌

Published : 05 Dec 2021 05:59 IST

ఎంపికైన జట్టుతో రిజిస్ట్రార్‌ ఆచార్య మహ్మద్‌ హుస్సేన్‌, విభాగాధిపతి శివశంకర్‌ రెడ్డి

తిరుపతి(క్రీడలు): దక్షిణాది అంతర విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్‌ పోటీలకు శ్రీవేంకటేశ్వర వర్సిటీ పురుషుల జట్టు ఎంపికైందని.. వర్సిటీ వ్యాయామ విద్యావిభాగం విభాగాధిపతి ఆచార్య ఎం.శివశంకర్‌ రెడ్డి శనివారం ఒక ప్రటనలో తెలిపారు. ఈనెల 6 నుంచి గుంటూరు కె.ఎల్‌.యూనివర్సిటీలో జరగనున్న పోటీల్లో ఎస్వీయూ జట్టు పాల్గొంటుందని చెప్పారు. ఎంపికైన జట్టును అభినందిస్తూ రిజిస్ట్రార్‌ ఆచార్య మహ్మద్‌ హుస్సేన్‌ క్రీడా దుస్తులను అందజేశారు. జట్టుకు మేనేజర్‌, శిక్షకుడిగా ఎస్వీ పశువైద్య కళాశాల బ్యాడ్మింటన్‌ శిక్షకుడు జి.శివయ్య వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

ఎంపికైన జట్టు వివరాలు ఇలా..

తిరుపతి ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సి.మహేష్‌ తేజ, కె.జ్ఞానసాగర్‌, సిద్ధార్థ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలకు చెందిన ఎన్‌.ఎం.శేఖర్‌, ఎం.వెంకటేష్‌, ఎస్వీయూ ఆర్ట్స్‌ కళాశాలకు చెందిన ఆర్‌.ఎస్‌.యోగానంద, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు చెందిన బి.సాయికుమార్‌ నాయక్‌, ఎమరాల్డ్స్‌ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌.ఎస్‌.చారుకేష్‌ జట్టులో ఉన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని