Road Accident: మదనపల్లెలో దారుణం.. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె

Updated : 16 Jan 2022 06:11 IST

మదనపల్లె (నేర వార్తలు): రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాల్మీకిపురం మండలం చంతపర్తి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ (21), అతని స్నేహితుడు సిద్ధిక్‌ (21)లు మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి చింతపర్తికి వెళ్తున్నారు. మార్గమధ్యంలోని మదనపల్లె రూరల్‌ ఐదో మైలు వద్దకు రాగానే మరో ద్విచక్రవాహనం ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులతో పాటు మరో ద్విచక్రవాహనంపై ఉన్న మదనపల్లె రూరల్‌ కొత్తవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (40) తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి 108కి సమాచారం ఇచ్చారు. వారిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాసులు మార్గమధ్యంలోనే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని తిరుపతికి రెఫర్‌ చేశారు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఇస్మాయిల్‌, సిద్దిక్‌ మృతి చెందారు. ఈ మేరకు మదనపల్లె రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని