రెవెన్యూ పాపం.. పేదలకు శాపం
సత్యవేడు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారాయి. పరిశ్రమకు భూములు త్యాగం చేసినా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిన్నపాండూరు రెవెన్యూలో సర్వేనం.44లో 374 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్వైకాలనీకి చెందిన 126
భూపరిహారంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
అన్యాయం జరిగిందంటూ నిరసన చేపట్టిన వీకేఆర్వై కాలనీ గిరిజనులు (పాతచిత్రం)
న్యూస్టుడే, వరదయ్యపాళెం, సత్యవేడు రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారాయి. పరిశ్రమకు భూములు త్యాగం చేసినా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిన్నపాండూరు రెవెన్యూలో సర్వేనం.44లో 374 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. చిన్నపాండూరు పంచాయతీ వీకేఆర్వైకాలనీకి చెందిన 126 గిరిజన కుటుంబాలకు 1995లో 1.50 ఎకరా చొప్పున.. 2009లో రెండో విడత భూపంపిణీలో మరో 44మందికి ఎకరా చొప్పున పంపిణీ చేశారు. 1995లో ఇదే రెవెన్యూలోని భూమిని సమీపంలోని రాచర్లకు చెందిన 90మంది ఎస్సీలకు భూ పంపిణీ కింద పట్టాలు ఇచ్చారు. అయితే వారికి ఇంత వరకు భూములు చూపలేదు. ఇదిలా ఉండగా వీకేఆర్వైకాలనీకి చెందిన గిరిజనులకు ఇచ్చిన భూముల్లో సీఎల్డీపీ పథకం కింద భూ అభివృద్ధి పనులు చేపట్టారు. కొంత భూమిలో ప్రభుత్వం ద్వారా మామిడితోటల పెంపకాన్ని చేపట్టారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను సైతం నూతన సెజ్గా కేటాయించారు. అందుకు లబ్ధిదారులు అంగీకరించారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడే రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పాల్పడిన భూకుంభకోణం వెలుగు చూసింది.
ఒకే భూమి.. ముగ్గురు లబ్ధిదారులు
ప్రభుత్వం భూపంపిణీ కింద దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములపై పట్టాలు లబ్ధిదారుల వద్దే ఉండగా.. అదే భూములపై నాటి రెవెన్యూ అధికారులు కుంభకోణానికి తెర లేపారు. భూములున్నది కేవలం 374 ఎకరాలైతే, పట్టాలు ఇచ్చింది 450 ఎకరాలకు. పేదలకు ఇచ్చిన భూములపై పట్టాలను రద్దు చేయకనే, అదే భూములపై స్థానికులతో పాటు, స్థానికేతరులకు సైతం పట్టాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఒకే భూమిపై ఇద్దరు, ముగ్గురికి పట్టాలు సృష్టించారు. ఇలా ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో ఇతరులకు సైతం పట్టాలు ఇవ్వడంతో ఒకేభూమిపై ఇద్దరికి పట్టాలు ఉన్న కారణంగా పరిహారం నిలుపుదల చేశారు. అవినీతి కుంభకోణానికి ప్రమేయం ఉన్న అధికారిని అప్పట్లో బదిలీ చేసినా, సెజ్ భూసేకరణ ప్రక్రియలో ఆయననే కొనసాగించడంతో ఈ భూ అక్రమాలు మరింత విస్తరించాయని విమర్శలు వచ్చాయి. తమకు న్యాయం చేయాలని గిరిజనులు, దళితులు ఆరేళ్లుగా చిత్తూరు, తిరుపతిలోని పాలనాధికారి, ఉపపాలనాధికారుల వద్దకు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. పలుమార్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవలే రాచర్ల ఎస్సీలు నిరాహారదీక్ష చేపట్టడం తెలిసిందే. నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిలో పట్టాలు మంజూరు చేసినందుకు ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు ఆరైలు, ఇద్దరు వీఆర్వోలపై కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులను చెరబడుతున్న వైకాపా నేతలు
[ 29-03-2024]
వైకాపా నేతల కబంధ హస్తాల్లో చెరువులు చిక్కుకున్నాయి. కుదిరితే కబ్జా చెయ్.. లేదంటే మట్టి తవ్వి సొమ్ము చేసుకో అన్న చందంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. -
భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
[ 29-03-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. -
స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం
[ 29-03-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. -
అల్పాదాయాల్లోనే.. స్వయం సహాయక సంఘాలు
[ 29-03-2024]
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను వైకాపా సర్కార్ ఉపయోగించుకోవడం లేదు. 80 శాతం రాయితీతో స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణం సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. -
నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి. -
‘ఓటమి భయంతోనే దోచుకున్న సొత్తు విదేశాలకు’
[ 29-03-2024]
ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దోచుకున్న ధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ ఆరోపించారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. -
ప్రైవేటు వాహనానికి ప్రభుత్వ స్టిక్కర్
[ 29-03-2024]
ఆయన అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు.. ఆయన కోడలు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్పర్సన్ వారి స్వంత వాహనంపై ప్రభుత్వ వాహనమంటూ స్టిక్కర్ తలిగించుకున్నారు. -
అధికారుల అనుమతి తర్వాతే వాలంటీర్ల రాజీనామాకు ఆమోదం
[ 29-03-2024]
ప్రభుత్వ భవనాలపై పార్టీ రంగులుంటే అవి అభ్యంతరాల కింద రావు. ఆ రంగులు ఎప్పట్నుంచో ఉన్నవే. ప్రభుత్వ భవనాలపై పార్టీ చిహ్నాలు, నేతల ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
గరం గరం.. పశుగ్రాసం
[ 29-03-2024]
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. -
పుంగనూరులో ట్రేడింగ్ మోసగాడు
[ 29-03-2024]
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. -
జగన్ సర్కార్పై మత్స్యకారులు గుర్రు
[ 29-03-2024]
‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం’. -
చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
[ 29-03-2024]
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. -
అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
[ 29-03-2024]
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. -
దేవుడి పేరు చెప్పి.. కాలువ కబ్జా..!
[ 29-03-2024]
అధికార పార్టీ నేతలకు చెరువులు.. పంట కాలువలంటే లెక్కలేకుండాపోయింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఏకంగా తుమ్మలగుంట చెరువునే మాయం చేసినట్లు ఆరోపణలుండగా చోటామోటా నాయకులు కాలువ పోరంబోకు భూములపై పడుతున్నారు. -
తిరుమల నడకదారిలో చిరుత
[ 29-03-2024]
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈనెల 25, 26వ తేదీ తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని, అటవీశాఖ ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం గుర్తించినట్లు తితిదే అటవీశాఖ డీఎఫ్వో శ్రీనివాసులు వెల్లడించారు. -
బహిర్గతమైన వైకాపా కుమ్ములాటలు
[ 29-03-2024]
కేవీబీపురం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం రాత్రి వైకాపా మండల బీసీˆసెల్ అధ్యక్షుడు హరిబాబు, మండల కోఆప్షన్ మెంబర్ జాకీర్ హుస్సేన్ మధ్య జరిగిన గొడవలే నిదర్శనం. -
పీ అండ్ పీవో వ్యవస్థ నిర్వీర్యం
[ 29-03-2024]
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎప్పటికప్పుడు కొత్త వాహకనౌకలను రూపొందించి, మానవాళి అవసరాలకు అనుగుణంగా ఉపగ్రహాలను తయారు చేసి, కక్ష్యలోకి పంపుతోంది. -
ఊరించి.. కొర్రీలతో వంచించి
[ 29-03-2024]
మీకు నేనున్నా.. మీ కష్టనష్టాలు తీరుస్తా.. అంటూ తన పాదయాత్ర సమయంలో ఇంటర్, డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి జగనన్న చివరకు మాటతప్పి మడమ తిప్పేశారు. -
ఈ లెక్కలు బయటకు రావా..?
[ 29-03-2024]
కులగణన సర్వే ప్రక్రియ ముగిసినా.. ప్రభుత్వం దాని వివరాలు నేటికీ వెల్లడించలేదు. ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టిన సర్వే ప్రక్రియ జిల్లాలో ఫిబ్రవరిలోనే ముగిసింది.