మట్టి మాఫియా !
చంద్రగిరి గ్రామీణ జిల్లా ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటం అక్రమార్కులకు వరమైంది. తూర్పు ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తమిళనాడు ప్రాంతానికి తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో కొండలను తొలగిస్తుంటే.. మరికొన్నిచోట్ల ఇచ్చిన అనుమతులను
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రవాణా
అడ్డుకోవడంలో అధికారుల విఫలం
చంద్రగిరి మండలం చిన్నరామాపురం పంచాయతీ పరిధిలోని భీమవరం, ఎగువ కూచువారిపల్లి ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుంటున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నరామాపురానికి చెందిన అధికార పార్టీ నేత పట్టపగలు ఇసుక, మట్టి తరలిస్తున్నా.. అడిగేవారు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. భీమవరం గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 13లో దరఖాస్తు పట్టా భూములుండగా అక్కడ నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
సత్యవేడు పరిధిలోని కొల్లడం, అల్లపగుంట, మదనంజెరి, బాలకృష్ణాపురం, చెన్నేరి తదితర ప్రాంతాల నుంచి మట్టి తరలిస్తున్నారు. కొన్నింటికి అనుమతులు ఉన్నా ఇచ్చిన దానికంటే పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు కనీసం అక్కడికి వెళ్లి పరిశీలించే సాహసం చేయని పరిస్థితి నెలకొంది.
తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి ప్రాంతంలోనూ ఇటీవలి వరకు యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. కొండలను సైతం తోడేశారు.
చర్యలు చేపడుతున్నాం
ఇసుక అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి పట్టుకుంటున్నాం. ఎక్కడైనా మట్టి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఎన్ఫోర్స్మెంట్ విభాగం, మైనింగ్ శాఖతో సమన్వయం ఏర్పర్చుకుని పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. - కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి
చంద్రగిరి మండలంలో మట్టి తరలిస్తున్న టిప్పరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా