పీఆర్సీని నిరసిస్తూ నేడు కలెక్టరేట్ ముట్టడి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. జిల్లాలోని ఒకట్రెండు సంఘాలు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సామాజిక మాధ్యమాల్లో
ముందస్తు అరెస్టులకు సిద్ధమైన పోలీసులు
చిత్తూరు విద్య, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. జిల్లాలోని ఒకట్రెండు సంఘాలు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో 10వేల మంది పాల్గొంటారని ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ముట్టడి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారిని ఎక్కడక్కడే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు సమాయత్తమైనట్లు తెలిసింది. వాహనాల్లో జిల్లా కేంద్రానికి వచ్చే వారిని రహదారులపై అదుపులోకి తీసుకోనున్నారు. బుధవారం రాత్రి పలువురిని అదుపులోకి తీసుకోవాలని సన్నద్ధమయ్యారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లి కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారని సమాచారం.
‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం’
పీఆర్సీ ప్రకటనతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ చేయడం ఇదే మొదటిసారని ఫ్యాప్టో జిల్లా కో-ఛైర్మన్ జీవీ రమణ తెలిపారు. అశుతోష్మిశ్రా కమిటీని ప్రభుత్వం బహిర్గతం చేయకుండా సీఎస్ సిఫార్సు చేసిన వాటిని అమలు చేయడం దారుణమన్నారు.
తీవ్ర నిరాశ మిగిల్చింది.. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ.. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏపీ కళాశాలల విశ్రాంత అధ్యాపకుల సంఘం జిల్లా కార్యవరర్గ సభ్యుడు హరినాయుడు, ఉపాధ్యాయ పింఛనుదారుల సంఘం అధ్యక్షుడు శ్రీరామూర్తి వేర్వేరు ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఎస్టీయూ సంఘీభావం
ప్లకార్డు ప్రదర్శిస్తున్న గంటా మోహన్
చిత్తూరు విద్య, న్యూస్టుడే: పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సంఘీభావంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు గంటా మోహన్ బుధవారం ఒకరోజు నిరహార దీక్ష చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్తో నాలుగు రోజులుగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, విధానాల అమలకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి నిరాశజనకంగా ఉందన్నారు. తాజా పీఆర్సీ అమలులో దేశ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు తగ్గే దయనీయ స్థితి ఏర్పడిందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా