logo

హత్య కేసులోనలుగురి అరెస్ట్‌

మండలంలోని కొండకిందపల్లిలో రవికుమార్‌(32) హత్య కేసులో నిందితులు క్రిష్ణయ్య, ఆదిలక్ష్మి, వారి కుమారులు శ్రీనివాసులు, మల్లికార్జునను పాకాల పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద విలేకరుల సమావేశంలో సీఐ ఆశీర్వాదం కేసు వివరాలు వెల్లడించారు. ‘ఇంటి దారి,

Published : 20 Jan 2022 05:26 IST

కేసు వివరాలను తెలియజేస్తున్న సీఐ ఆశీర్వాదం

పాకాల: మండలంలోని కొండకిందపల్లిలో రవికుమార్‌(32) హత్య కేసులో నిందితులు క్రిష్ణయ్య, ఆదిలక్ష్మి, వారి కుమారులు శ్రీనివాసులు, మల్లికార్జునను పాకాల పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద విలేకరుల సమావేశంలో సీఐ ఆశీర్వాదం కేసు వివరాలు వెల్లడించారు. ‘ఇంటి దారి, ఆస్తి తగాదాలకు సంబంధించి రవికుమార్‌, నిందితులకు మధ్య గొడవలు తలెత్తగా.. ఆర్నెళ్ల కిందట గ్రామస్థులు పరిష్కరించారు. దీన్ని మనసులో ఉంచుకుని రవికుమార్‌ సోమవారం రాత్రి పొలం నుంచి తిరిగి ఇంటికొస్తుండగా నిందితులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. పదిపుట్లబైలు వద్ద బస్‌షెల్టర్‌లో ఉండగా వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నాం’ అని సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని