logo

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ హోమం

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గురువారం తిరుపతిలో తెలుగు యువత నాయకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో స్థానిక

Published : 21 Jan 2022 02:24 IST


హోమం నిర్వహిస్తున్న రవినాయుడు తదితరులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గురువారం తిరుపతిలో తెలుగు యువత నాయకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో స్థానిక మంచినీళ్లగుంట వద్ద శివాలయంలో హోమం చేశారు. చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఆర్పీ శ్రీనివాసులు, మధుబాబు, కృష్ణయాదవ్‌, కుమార్‌, శ్రీరామ్‌, జయబాబు, వంశీ, సుభాష్‌, జ్ఞానశేఖర్‌, వెంకటేష్‌, భూపతి, వెంకట్‌రెడ్డి, మురళీనాయుడు, అశోక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని