కొవిడ్ కేర్ కేంద్రాల్లోఆకలి కేకలు
కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో తిరిగి నియోజకవర్గానికో కొవిడ్ కేర్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీలేరు, శ్రీకాళహస్తితోపాటు మరో మూడు కేంద్రాలను ప్రారంభించగా.. మరో 12 కేంద్రాలను త్వరలోనే బాధితులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాలకు ఇన్ఛార్జుల
ఆహారం సక్రమంగా లేదంటూ నిరసన
గతేడాది భోజన బకాయిలు రూ.5 కోట్లకుపైనే
విష్ణు నివాసం వద్ద ఆందోళన చేస్తున్న కొవిడ్ బాధితులు
ఈనాడు డిజిటల్, చిత్తూరు, తిరుపతి వైద్య విభాగం : కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో తిరిగి నియోజకవర్గానికో కొవిడ్ కేర్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీలేరు, శ్రీకాళహస్తితోపాటు మరో మూడు కేంద్రాలను ప్రారంభించగా.. మరో 12 కేంద్రాలను త్వరలోనే బాధితులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కేంద్రాలకు ఇన్ఛార్జులను సైతం నియమించారు. అక్కడ వసతుల కల్పన, బాధితుల బాగోగులను పర్యవేక్షించే బాధ్యతను వీరు నిర్వర్తించనున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాధితులకు ఇచ్చే ఆహారం విషయంలో అడపాదడపా విమర్శలు వస్తున్నాయి. గతేడాది భోజనాలు సరఫరా చేసిన వ్యక్తులకు బిల్లులు చెల్లించకపోవడంతో.. ఈదఫా వారు ముందుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు.
కొవిడ్ బాధితులు నాణ్యమైన భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. పురుగులు పట్టిన అన్నం.. నాణ్యతలేని చపాతి, సాంబారు అందిస్తున్నారంటూ తిరుపతి విష్ణు నివాసంలోని బాధితులు ఇటీవల కాలంలో పలుమార్లు ఆందోళనకు దిగారు. మిగిలిన ఆస్పత్రులు, కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పర్యవేక్షిస్తున్న అధికారులు స్పందించడం లేదు. ఆందోళనకు కారణాలు విశ్లేషిస్తే.. కొన్ని నెలలుగా ఆహార సరఫరాదారులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకపోవడమేనని తెలిసింది.
అప్పటి బిల్లులు చెల్లిస్తేనే..
గతేడాది బిల్లులే ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో.. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఆహారం అందించడానికి కొందరు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం తిరుపతిలో పర్యాటక శాఖ ద్వారా భోజనాలు అందిస్తుండగా, మరికొన్నిచోట్ల స్థానిక హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడి అక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. దీంతో నాణ్యత దెబ్బతిందనే విమర్శలు వస్తున్నాయి. ఈవిషయమై జేసీ (అభివృద్ధి) శ్రీధర్ స్పందిస్తూ.. ఇప్పటికే బిల్లులను అప్లోడ్ చేశామని, మరో అయిదారు రోజుల్లో బకాయిలు విడుదలవుతాయని పేర్కొన్నారు.
పద్మావతి నిలయంలోనే రూ.2 కోట్లకుపైగా
జిల్లాలో అత్యధికంగా తిరుపతిలోని కొవిడ్ కేర్ కేంద్రాల్లో బాధితులను ఉంచారు. దీనికితోడు నియోజకవర్గానికో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో మెనూ రూపొందించి.. ఆమేరకు అల్పాహారం, భోజనాలు అందించారు. ఆహారం సరఫరా చేసే బాధ్యతను కొందరు హోటళ్ల నిర్వాహకులు, అప్పటికే ఆసుపత్రుల్లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి అప్పగించారు. తిరుపతిలో రోజు మార్చి రోజు రోజు బిల్లులు చెల్లిస్తామని అప్పట్లో అధికారులు తెలిపారు. ప్రారంభంలో ఒక్కో బాధితుడికి రోజుకు రూ.500 చొప్పున బిల్లు ఇస్తామని పేర్కొనగా.. ఆ తర్వాత ప్రభుత్వం మరో ధరను నిర్ణయించింది. ఈమేరకు తిరుపతిలోని ఒక్క పద్మావతి నిలయంలో భోజనాలు అందించిన వ్యక్తికే రూ.2 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. విష్ణు నివాసం రూ.1.25 కోట్లు, పీలేరు రూ.28 లక్షలు, పలమనేరు రూ.13 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాల్లో కలిపి సుమారు రూ.5 కోట్లకుపైగానే బిల్లులు రావాల్సి ఉందని తెలుస్తోంది.
జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాలు 15
మొత్తం పడకలు 3,444
ప్రస్తుతం ప్రారంభమైనవి 15
చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 594
జిల్లా వ్యాప్తంగా గతేడాది భోజన బకాయిలు రూ.5 కోట్లకుపైగా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..